తెలంగాణ

telangana

ETV Bharat / city

తుపాను ప్రభావంతో రైతులు, ప్రజల ఇబ్బందులు - నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు

నివర్ తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వందల ఎకరాల్లో వరినాట్లు నీటమునిగాయి. మరో 2 రోజులు నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో.. రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరులో చెట్టు విరిగిపడి ఒకరు మృతి చెందారు. జిల్లాలో దాదాపు 5 వేల మంది యంత్రాంగం.. సహాయక చర్యల్లో పాలుపంచుకుంటోంది.

heavy-rain-in-nellore-district
తుపాను ప్రభావంతో రైతులు, ప్రజల ఇబ్బందులు

By

Published : Nov 26, 2020, 1:41 PM IST

తుపాను ప్రభావంతో రైతులు, ప్రజల ఇబ్బందులు

నివర్‌ తుపాను ప్రభావంతో..ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాలో మైపాడు బీచ్‌ వద్ద సముద్రం అలజడి సృష్టిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక స్థానిక మత్య్సకారులు ఆందోళన చెందుతున్నారు. మర్రిపాడు మండలంలో మిర్చి, మినుము, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కలువాయి మండలం చింతల ఆత్మకూరును వరద చుట్టుముట్టింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బొగలదిన్నె నీటి ప్రవాహంతో గ్రామస్థుల్లో భయాందోళన నెలకొంది. కలిగిరి మండలాల్లో పలు చెరువులు ప్రమాదకరస్థితికి చేరుకున్నాయి.

వెంకటగిరి - రాపూరు మధ్య లింగసముద్రం వంతెన కూలింది. స్వర్ణముఖి నది, కొండాపురం మండలంలో మిడతవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రవహంతో.. సత్యవోలు ఆగ్రహారం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాగుంట లేఔట్ ప్రాంతంలో వర్షానికి ఓ చెట్టు విరిగి ఓ వ్యక్తి మృతి చెందాడు.

తుపాన్‌ ప్రభావంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు నెల్లూరు తహసీల్దార్‌ కార్యాలయంలో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏదైనా సమాచారం కోసం కాల్‌ సెంటర్‌ నెంబర్‌ 897 876 2988 కి ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఎన్డీఆర్​ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నారని.. ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్‌ తెలిపారు.

వెంకటగిరి నియోజకవర్గంలో రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కైవల్య నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దక్కిలి మండలం నడింపల్లి, బాలాయపల్లి మండలం నిండాలి దగ్గర కైవల్య నది కాజ్వేల పై ప్రవాహం ఉప్పొంగడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతుంది.

ఇదీ చదవండి:సీఎం వెంటనే స్పందించాలి: బండి

ABOUT THE AUTHOR

...view details