తెలంగాణ

telangana

'ఈ కేసు విచారణ ఆ బెంచ్​లోనే ఉంటే బాగుంటుంది'

By

Published : Sep 2, 2020, 3:34 PM IST

న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రతివాదులకు ప్రధాన న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. కేసును చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదలాయిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

'ఈ కేసు విచారణ ఆ బెంచ్​లోనే ఉంటే బాగుటుంది'
'ఈ కేసు విచారణ ఆ బెంచ్​లోనే ఉంటే బాగుటుంది'

కొంతమంది న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ విశాఖ న్యాయవాది నిమ్మిగ్రేస్ వేసిన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే ఈ వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ పిటిషనర్ వాదనలు విని సంతృప్తి చెందింది. పలు కంపెనీల నెట్​వర్క్ ప్రొవైడర్స్​కు, సీబీఐ, సీవీసీలకు నోటీసులు జారీ చేశారని పిటిషనర్ న్యాయవాది శ్రవణ్​కుమార్.. జస్టిస్ రాకేశ్​కుమార్ బెంచ్​కు వివరించారు.

ప్రధాన న్యాయమూర్తి బెంచ్ వాదనలు విని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినందునా... ఈ కేసు విచారణ ఆ బెంచ్​లోనే ఉంటే బాగుంటుందని జస్టిస్ రాకేశ్​​కుమార్, జస్టిస్ ఉమాదేవి బెంచ్​ అభిప్రాయపడిందని పిటిషనర్ న్యాయవాది శ్రవణ్ తెలిపారు. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి బెంచ్​కు బదిలీ చేస్తూ ఆదేశాలు చేశారు. ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకు, న్యాయమూర్తుల కదలికలను తెలుసుకునేందుకు ఇద్దరు ఐపీఎస్ అధికారులు, 40 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నారని పిటిషనర్​ పేర్కొన్నట్లు న్యాయవాది శ్రవణ్ తెలిపారు.

ఇదీ చదవండీ...ఎరువుల సరఫరాపై సదానందగౌడతో కిషన్​రెడ్డి భేటీ

ABOUT THE AUTHOR

...view details