తెలంగాణ

telangana

ETV Bharat / city

గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ దుర్గా ప్రసాద్‌పై సస్పెన్షన్‌ వేటు

ఏపీ గుంటూరు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ దుర్గా ప్రసాద్‌పై వేటు పడింది. సస్పెన్షన్‌లో రాజకీయ కోణం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకుడి ఫోన్ కాల్ డేటా విషయంలో వివాదమే కారణమని సమాచారం.

By

Published : Nov 16, 2020, 6:51 PM IST

gurazala dsp suspend
గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ దుర్గా ప్రసాద్‌పై సస్పెన్షన్‌ వేటు

గుంటూరు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ దుర్గా ప్రసాద్​ను సస్పెండ్ చేస్తూ ఏపీ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సస్పెన్షన్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పలు కేసుల విచారణలో అలసత్వంగా వ్యవహరించటం ఇద్దరి సస్పెన్షన్​కు కారణమని పోలీసువర్గాలు చెబుతున్నా.. అంతర్గతంగా రాజకీయ కోణం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఓ ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకుడి ఫోన్ కాల్ డేటాను మరో ప్రజాప్రతినిధికి అందించారని... సదరు ప్రజాప్రతినిధి డీజీపీకి ఫిర్యాదు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డేటాను అనధికారికంగా ఇవ్వడం వల్లే ఉన్నతాధికారులు ఇద్దరిపైనా వేటు వేసినట్టు భావిస్తున్నారు.

ఇవీచూడండి:ఏ క్షణమైనా జీహెచ్​ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్​!

ABOUT THE AUTHOR

...view details