తెలంగాణ

telangana

ETV Bharat / city

వచ్చే వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం: మంత్రి గంగుల - minister gangula

‘‘రాష్ట్రంలో వచ్చేవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం అవుతాయి. ప్రస్తుత సీజన్‌లో 75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నాం.‘‘ - పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

grain purchase in Telangana
ధాన్యం కొనుగోళ్లు

By

Published : Oct 30, 2020, 9:29 AM IST

‘‘రాష్ట్రంలో వచ్చేవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం అవుతాయి. ప్రస్తుత సీజన్‌లో 75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి. ధాన్యంలో 17 శాతంలోపు తేమ ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు తక్షణం దించుకోవాలి’’ అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

గురువారం పౌరసరఫరాల భవన్‌లో అధికారులు, రైస్‌ మిల్లర్లతో మంత్రి, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డిలు సమీక్ష సమావేశం నిర్వహించారు.

‘‘ఇప్పటికి రూ.3.15 కోట్ల విలువ చేసే 16,702 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో 1,071 కొనుగోలు కేంద్రాలను తెరిచాం. ప్రస్తుత సీజనులో 6,400 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రైతుల నుంచి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తాం. మిల్లర్ల సమస్యలను త్వరలో సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తాం’’

మంత్రి గంగుల కమలాకర్‌

ABOUT THE AUTHOR

...view details