తెలంగాణ

telangana

ప్రధాని మోదీ చెప్పినట్లు దీపాలు వెలిగిద్దాం: గవర్నర్​

ప్రధాని మోదీ పిలుపు మేరకు రేపు అందరూ లైట్లు ఆర్పివేసి దీపాలు వెలిగిద్దామన్నారు గవర్నర్ తమిళిసై. రేపు రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు కొవ్వొత్తులు, దీపాలు, టార్చ్​లు, మొబైల్ ఫ్లాష్ లైట్ల ద్వారా దీపాలు వెలిగించాలని అన్నారు.

By

Published : Apr 4, 2020, 8:49 PM IST

Published : Apr 4, 2020, 8:49 PM IST

Governor Thamilisai Soundararajan
Governor Thamilisai Soundararajan

ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు అందరూ లైట్లు ఆర్పివేసి దీపాలు వెలిగిద్దామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. దీపం వెలిగించడం ద్వారా కరోనా వైరస్​పై మూకుమ్మడి పోరుకు సంకేతంగా నిలుద్దామని అన్నారు.

రేపు రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు కొవ్వొత్తులు, దీపాలు, టార్చ్​లు, మొబైల్ ఫ్లాష్ లైట్ల ద్వారా దీపాలు వెలిగించాలని అన్నారు. ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించాలని గవర్నర్ తమిళిసై కోరారు. రోడ్లపైకి రాకుండా ఇంటి ద్వారాలు, బాల్కానీల వద్దే దీపాలు వెలిగించాలని సూచించారు.

ప్రధాని మోదీ చెప్పినట్లు దీపాలు వెలిగిద్దాం: గవర్నర్​

ఇదీ చూడండి:లైట్స్​ ఆపితే పవర్​ గ్రిడ్​పై ప్రభావం పడుతుందా?

ABOUT THE AUTHOR

...view details