తెలంగాణ

telangana

By

Published : Jan 11, 2020, 2:42 PM IST

Updated : Jan 11, 2020, 3:34 PM IST

ETV Bharat / city

పుర ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రిటీలు: గవర్నర్

పురపాలక ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రిటీలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ తారామతి బారాదరిలో జరిగిన తెలంగాణ ప్రజాస్వామ్య అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హజరైన ఆమె పురస్కారాలు అందజేశారు.

పుర ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రెటీలు: గవర్నర్
పుర ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రెటీలు: గవర్నర్

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ ప్రజాస్వామ్య అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. హైదరాబాద్​లోని తారామతి బారాదరిలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ హాజరయ్యారు. ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్నికల సంఘాన్ని, కమిషనర్​ నాగిరెడ్డిని ఆమె ప్రశంసించారు. సాధారణ ఎన్నికల కన్నా స్థానిక ఎన్నికల్లో పోలింగ్​ శాతం ఎక్కువ నమోదవుతోందని గవర్నర్​ అన్నారు. పోలింగ్‌ శాతం పెంచేందుకు చేపడుతున్న చర్యలను గవర్నర్​ అభినందించారు.

పురపాలక ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రిటీలని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఎన్నికల విధానం గొప్పదని కితాబిచ్చారు. అనంతరం పురస్కార గ్రహీతలకు అవార్డులు అందజేశారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ అత్యధిక పురస్కారాలు తమ శాఖ ఉద్యోగులకే దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

పుర ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రిటీలు: గవర్నర్

ఇవీ చూడండి: పురపోరుకు 21,850 నామినేషన్లు.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో..

Last Updated : Jan 11, 2020, 3:34 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details