తెలంగాణ

telangana

By

Published : Jan 26, 2021, 7:52 PM IST

Updated : Jan 26, 2021, 9:40 PM IST

ETV Bharat / city

కర్నల్ సంతోష్​బాబు కుటుంబానికి అరుదైన గౌరవం

గల్వాన్​ లోయలో చైనా సైనికుల దాడిలో అమరుడైన కర్నల్ సంతోష్​ బాబు కుటుంబాన్ని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్​ సన్మానించారు. కేంద్ర ప్రభుత్వం మహావీర్​ చక్ర పురస్కరం ప్రకటించిన సందర్భంగా రాజ్​భవన్​కు పిలిపించి గౌరవించారు.

governor thamili sai soundara rajan felicitated Karnal santhosh babu family in rajbhavan
కర్నల్ సంతోష్​ బాబు కుటుంబానికి రాజ్​భవన్​లో సన్మానం

కర్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాజ్​భవన్​లో అరుదైన గౌరవం దక్కింది. గల్వాన్ లోయలో చైనా సైనికుల దాడిలో అమరుడైన సంతోష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించింది.

ఈ మేరకు సంతోష్ బాబు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ సహా కుటుంబసభ్యులను రాజ్​భవన్​కు ఆహ్వానించిన గవర్నర్... వారిని సన్మానించారు. సంతోష్ బాబు త్యాగాన్ని ఈ దేశం మరవదని కొనియాడారు.

ఇదీ చూడండి:కర్నల్​ సంతోష్​కుమార్​ భార్యకు కలెక్టరేట్​లో సన్మానం

Last Updated : Jan 26, 2021, 9:40 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details