హైదరాబాద్లోని ఈఎస్ఐ ఆస్పత్రికి వెంటిలేటర్లు, కొవిడ్ ఐసీయూలతో పాటు.. రోజుకు మూడు వేల పరీక్షలు చేసే యంత్రాన్ని మంజూరు చేసేందుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోశ్ కుమార్ గాంగ్వార్ అంగీకరించారు. కేంద్ర మంత్రితో ఫోన్లో మాట్లాడిన సమయంలో ఐసీయూలు, పరీక్షల యంత్రం మంజూరుకు అంగీకరించినట్లు గవర్నర్ తమిళి సై తెలిపారు.
ఈఎస్ఐ ఆస్పత్రికి వెంటిలేటర్లు... కేంద్ర మంత్రికి గవర్నర్ కృతజ్ఞత - గవర్నర్ తమిళి సై కృతజ్ఞతలు
కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోశ్ కుమార్ గాంగ్వార్కు గవర్నర్ తమిళి సై ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లోని ఈఎస్ఐ ఆస్పత్రికి వెంటిలేటర్లు, కొవిడ్ ఐసీయూలతో పాటు.. రోజుకు మూడు వేల పరీక్షలు చేసే యంత్రాన్ని మంజూరు చేసినట్లు గవర్నర్ తెలిపారు.
![ఈఎస్ఐ ఆస్పత్రికి వెంటిలేటర్లు... కేంద్ర మంత్రికి గవర్నర్ కృతజ్ఞత 'ఈఎస్ఐ ఆస్పత్రికి వెంటిలేటర్లు, ఐసీయూలు మంజూరు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8012752-650-8012752-1594653870948.jpg)
'ఈఎస్ఐ ఆస్పత్రికి వెంటిలేటర్లు, ఐసీయూలు మంజూరు'
అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రికి గవర్నర్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈఎస్ఐ వసతి లేని పేదలకు ఉచితంగా, ఇతరులకు నామమాత్రపు రుసుముతో.. ఈఎస్ఐ డయాగ్నోస్టిక్ వసతి వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.