తెలంగాణ

telangana

By

Published : Oct 17, 2020, 12:12 AM IST

ETV Bharat / city

ఘనంగా జేఎన్​టీయూహెచ్​ తొమ్మిదో స్నాతకోత్సవం

హైదరాబాద్​ కూకట్​పల్లిలోని జేఎన్​టీయూహెచ్​లో తొమ్మిదో స్నాతకోత్సవం శుక్రవారం.. ఘనంగా జరిగింది. కొవిడ్​ నిబంధనల నడుమ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొని పీహెచ్​డీ అందుకున్నవారికి అభినందనలు తెలియజేశారు.

governor tamilisai sounderrajan at jntuh convocation at hyderabad
ఘనంగా జేఎన్​టీయూహెచ్​ తొమ్మిదో స్నాతకోత్సవం

హైదరాబాద్​ కూకట్​పల్లిలో జేఎన్​టీయూహెచ్​ తొమ్మిదో స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ వీడియో కాన్పరెన్స్​ ద్వారా అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ ఏడాది యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్​ను డిపార్ట్​మెంట్​ ఆప్​ డిఫెన్స్​ ఆర్​ఎండ్​డీ కార్యదర్శి, ఏరోనాటికల్​ డెవలప్​మెంట్​ ఏజెన్సీ డైరెక్టర్​ జనరల్​, డీఆర్డీవో ఛైర్మన్​ జి. సతీష్​రెడ్డికి అందజేశారు.

డా. సతీష్​రెడ్డికి అవార్డు ఇవ్వడంపై తమిళిసై ఆనందం వ్యక్తం చేశారు. శనివారం పీహెచ్​డీ అందుకున్నవారిలో కొవిడ్​ ఫ్రంట్​లైన్​ వారియర్స్​లో ఒకరైన డీజీపీ మహేందర్​రెడ్డి ఉండటం సంతోషకరమన్నారు. స్నాతకోత్సవం కార్యక్రమంలో 31 కోర్సులు పూర్తి చేసుకున్న 78,395 మందికి పట్టాలు ప్రదానం చేశారు. పట్టాలను సాధించిన‌ వారు సమాజం పట్ల సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని కోరారు.

ఘనంగా జేఎన్​టీయూహెచ్​ తొమ్మిదో స్నాతకోత్సవం

ఇదీ చూడండి:24 గంటల్లో కరెంట్ సరఫరా జరగాలి: కేటీఆర్ ఆదేశం

ABOUT THE AUTHOR

...view details