తెలంగాణ

telangana

By

Published : Dec 24, 2020, 3:49 PM IST

Updated : Dec 24, 2020, 4:33 PM IST

ETV Bharat / city

క్రైస్తవులకు గవర్నర్​, సీఎం క్రిస్మస్​ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్​ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే పండుగను చేసుకోవాలని సూచించారు. పండుగ పూట అందరి జీవితాల్లో అవధుల్లేని సంతోషం, ప్రశాంతత నిండాలని ఆకాంక్షించారు.

క్రైస్తవులకు గవర్నర్​ తమిళిసై క్రిస్మస్​ శుభాకాంక్షలు
క్రైస్తవులకు గవర్నర్​ తమిళిసై క్రిస్మస్​ శుభాకాంక్షలు

క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్​ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ... పండుగను చేసుకుందామని సూచించారు. ఈ ప్రపంచాన్ని మరింత సంపన్నంగా, శాంతియుతంగా మార్చుకునేందుకు తీర్మానించుకుందామని గవర్నర్​ పిలుపునిచ్చారు. అందరికీ అవధుల్లేని సంతోషం, ప్రశాంతత క్రిస్మస్​ పండుగ తీసుకురావాలని తమిళిసై ఆకాంక్షించారు. ప్రేమ, క్షమించే గుణం, నిజాయితీ, కరుణ, సోదరభావం, త్యాగాలకు జీసస్ జీవితం ప్రతీక అని వివరించారు. జీసస్ జన్మదినాన్ని జరుపుకునేందుకు ఇదో మంచి రోజని గవర్నర్​ పేర్కొన్నారు.

యేసు క్రీస్తు ప్రవచించిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు సుఖశాంతులతో నిండుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్​ సూచించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ... ప్రజలు సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: ఈటల అధ్యక్షతన నిపుణుల కమిటీ అత్యవసర భేటీ..!

Last Updated : Dec 24, 2020, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details