తెలంగాణ

telangana

ETV Bharat / city

పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు విమాన సర్వీసులు: గవర్నర్​ - తెలంగాణ తాజా వార్తలు

పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ హర్షం వ్యక్తం చేశారు. పుదుచ్చేరి నుంచి విమానంలో శంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సర్వీసులు అందరూ వినియోగించుకోవాలని కోరారు.

governor tamilasai
governor tamilasai

By

Published : Mar 27, 2022, 10:41 PM IST

పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు విమాన సేవలందిస్తున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ తెలిపారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. గవర్నర్​ చొరవతో పుదుచ్చేరి నుంచి హైదరాబాద్​ విమాన సర్వీసులు ప్రారంభం కాగా.. తమిళిసై ఇవాళ పుదుచ్చేరి నుంచి విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి ఎక్కువ మంది టూరిస్టులు వెళ్తారని గవర్నర్​ అన్నారు. విమాన సర్వీసుల ప్రారంభంతో వ్యాపార అనుసంధానం పెరుగుతుందన్నారు. ఈ విమాన సేవలను అందరూ వినియోగించుకోవాలని కోరారు.

ఇదీచూడండి:రేపే యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణం... యాగ జలాలతో పర్వానికి శ్రీకారం

ABOUT THE AUTHOR

...view details