తెలంగాణ

telangana

By

Published : Jan 30, 2021, 7:51 PM IST

ETV Bharat / city

డీఎంహెచ్​వో నరేష్​ భార్యకు గ్రూప్​-1 ఉద్యోగం

కొవిడ్ సేవలు అందిస్తూ... వైరస్​తో మృతి చెందిన భద్రాద్రి కొత్తగూడెం డీఎంహెచ్​వో డాక్టర్ భార్యకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. ఈ మేరకు నియామకానికి సంబంధించిన ప్రత్యేక జీవోను మంత్రి ఈటల రాజేందర్​ ఆమెకు అందజేశారు.

government job for bhadradri kothagudem dmho naresh wife
భద్రాద్రి డీఎంహెచ్​వో డాక్టర్ నరేష్​ భార్యకు గ్రూప్​-1 ఉద్యోగం

గతేడాది కొవిడ్ రోగులకు సేవలు అందిస్తూ... వైరస్​తో మృతి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంహెచ్​వో డాక్టర్ నరేష్ భార్య పావనికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ ప్రత్యేక జీవో విడుదల చేశారు. ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్​... ఆమె కుటుంబసభ్యులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, తెలంగాణ పబ్లిక్ హెల్త్ వైద్యుల సంఘం ప్రతినిధుల ఆధ్వర్యంలో జీవో కాపీని అందించారు.

గెజిటెడ్​ ఉద్యోగం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రి ఈటల రాజేందర్​కు... పావని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకోసం కృషి చేసిన సంఘం ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. కష్టపడి పనిచేసి... ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'ఉద్యోగాలివ్వండి.. లేదంటే కారుణ్య మరణాలకు అనుమతివ్వండి'

ABOUT THE AUTHOR

...view details