తెలంగాణ

telangana

ETV Bharat / city

''మాకు పరిహారం ఇంకా అందలేదు.. ఎప్పుడిస్తారు?'' - తూర్పుగోదావరి కలెక్టర్​ను కలిసిన బోటు ప్రమాద బాధితులు

గోదావరిలో బోటు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం తమకు ఇంకా అందలేదంటూ తెలంగాణకు చెందిన పలువురు.. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్​ను కలిశారు.

''మాకు పరిహారం ఇంకా అందలేదు.. ఎప్పుడిస్తారు?''

By

Published : Oct 11, 2019, 11:39 PM IST

''మాకు పరిహారం ఇంకా అందలేదు.. ఎప్పుడిస్తారు?''

గోదావరి బోటు ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన వరంగల్ జిల్లా వాసులు.. తూర్పు గోదావరి కలెక్టర్​ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇప్పటివరకు తమకు అందలేదని తెలిపారు. ఈ ఘటనలో తమ బంధువులు 15 మంది యాత్రకు రాగా, 9 మంది మృతిచెందారని తెలిపారు. వీరిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమవగా... మరో ముగ్గురు గల్లంతయ్యారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వారికి ధైర్యం చెప్పిన కలెక్టర్.. ప్రస్తుతం ధృవపత్రాల పరిశీలన జరుగుతోందని బదులిచ్చారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల కాగానే.. పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details