తెలంగాణ

telangana

ETV Bharat / city

జీహెచ్​ఎంసీ అధికారులకు కమిషనర్​ అభినందన

ఆస్తి పన్ను వసూళ్లలో గణనీయ వృద్ధి సాధించిన జీహెచ్​ఎంసీ అధికారులను కమిషనర్​ అభినందించారు. నిర్మాణ అనుమతుల ద్వారా రూ. 854 ​కోట్లు సేకరించడంపై టౌన్​ప్లానింగ్​ అధికారులను ప్రశంసించారు.

By

Published : Apr 3, 2019, 5:47 AM IST

జీహెచ్​ఎంసీ

రికార్డు స్థాయిలో జీహెచ్​ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లు
జీహెచ్​ఎంసీకి 2018-19 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 1401 కోట్లకు పైగా ఆస్తి పన్నును సేకరించడంలో ప్రతిభ చూపిన అధికారులకు అభినందన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిషోర్​, రెవెన్యూ విభాగం అడిషనల్​ కమిషనర్​ అద్వైత్​కుమార్​ సింగ్​, అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత పన్నుల విధానాన్ని మార్చకుండా అంతర్గత లోపాలను సవరించడం ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవచ్చని కమిషనర్​ అన్నారు. గత ఆరు నెలలుగా ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ పన్నుల సేకరణలో ఉత్తమ ఫలితాలు పొందడం జీహెచ్​ఎంసీ అధికారుల నిబద్ధతకు నిదర్శనమని దానకిషోర్​ ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details