చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లె సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. గ్రానైట్ పరిశ్రమలో రాళ్లను ఎత్తే క్రేన్ పాడైపోవటంతో రిపేరు చేసేందుకు వెల్డింగ్ షాపు వద్ద తీసుకువచ్చారు. క్రేన్ మరమ్మత్తుల్లో భాగంగా గ్యాస్తో వెల్డింగ్ చేస్తుండగా సిలిండర్ ఒక్కసారిగా పేలింది.
విషాదం : గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇద్దరు మృతి - కుప్పంలో గ్యాస్ సిలిండర్ పేలడు
చిత్తూరు జిల్లా తంబిగానిపల్లె సమీపంలో క్రేన్ మరమ్మత్తు చేస్తుండగా.. సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
![విషాదం : గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇద్దరు మృతి gas cylinder blast in chithhor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7135864-209-7135864-1589089565904.jpg)
విషాదం : గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇద్దరు మృతి
ఈ ప్రమాదంలో వెల్డింగ్ చేస్తున్న కార్మికులు అప్సర్, ఏజాబ్ ప్రాణాలు కోల్పోయారు. వెల్డింగ్ దుకాణం యజమాని గౌస్భాష, క్రేన్ ఆపరేటర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కుప్పం ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి వెల్డింగ్ చేస్తున్న కార్మికుల శరీరాలు ఛిద్రమైపోయాయి.
విషాదం : గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇద్దరు మృతి
ఇవీ చూడండి:మాజీ మంత్రి రత్నాకర్రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం