తెలంగాణ

telangana

ETV Bharat / city

పారిశుద్ధ్యం.. పరిశుభ్రతపై 8 నుంచి వారోత్సవాలు - గంధగీ ముక్త భారత్‌ వార్తలు

పారిశుద్ధ్యం, పరిశుభ్రత పట్ల ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఈ నెల 8 నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్‌ మిషన్‌ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఈ వారోత్సవాల అమలుపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు మార్గదర్శకాలు జారీచేశారు.

village
village

By

Published : Aug 4, 2020, 10:58 AM IST

గంధగీ ముక్త భారత్‌ (జీఎంబీ) కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రఘునందన్‌రావు ఆదేశించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత పట్ల ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఈ నెల 8 నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఈ వారోత్సవాల అమలుపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు రఘునందన్‌రావు మార్గదర్శకాలు జారీచేశారు.

ఇవీ మార్గదర్శకాలు

  • 8న సర్పంచులతో జిల్లా కలెక్టర్లు సమావేశం నిర్వహించాలి.
  • 9న సర్పంచుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరించాలి. వాటి నుంచి ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ను వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
  • 10న గ్రామ పంచాయతీలస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేసేందుకు శ్రమదానం కార్యక్రమం చేపట్టాలి. శ్రమదానంపై చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నంబరు (18001800404) కేటాయించింది.
  • 11న పరిశుభ్రతపై ప్రేరణ కలిగించేలా, ప్రజలంతా ఉద్యమించేలా గ్రామాల్లో గోడలపై చిత్రాలు (వాల్‌ పెయింటింగ్‌) గీయించాలి. దీనికి సంబంధించి 5 చిత్రాల నమూనాలను జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే పంపారు.
  • 12న మొక్కలు నాటడం, శ్రమదానం నిర్వహించాలి.
  • 13న ‘నా గ్రామం మురికి రహితం’ అంశంపై 6, 7 తరగతుల విద్యార్థులకు పెయింటింగ్‌; 9, 10 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలి.
  • 14న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలి.
  • 15న గ్రామసభలు నిర్వహించి ప్రమాణం చేయించాలి. స్థానికంగా మరిన్ని ప్రయోగాత్మక కార్యక్రమాలు కూడా చేపట్టవచ్చు.

ABOUT THE AUTHOR

...view details