తెలంగాణ

telangana

ETV Bharat / city

పారిశుద్ధ్యం.. పరిశుభ్రతపై 8 నుంచి వారోత్సవాలు

పారిశుద్ధ్యం, పరిశుభ్రత పట్ల ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఈ నెల 8 నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్‌ మిషన్‌ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఈ వారోత్సవాల అమలుపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు మార్గదర్శకాలు జారీచేశారు.

By

Published : Aug 4, 2020, 10:58 AM IST

village
village

గంధగీ ముక్త భారత్‌ (జీఎంబీ) కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రఘునందన్‌రావు ఆదేశించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత పట్ల ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఈ నెల 8 నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఈ వారోత్సవాల అమలుపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు రఘునందన్‌రావు మార్గదర్శకాలు జారీచేశారు.

ఇవీ మార్గదర్శకాలు

  • 8న సర్పంచులతో జిల్లా కలెక్టర్లు సమావేశం నిర్వహించాలి.
  • 9న సర్పంచుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరించాలి. వాటి నుంచి ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ను వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
  • 10న గ్రామ పంచాయతీలస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేసేందుకు శ్రమదానం కార్యక్రమం చేపట్టాలి. శ్రమదానంపై చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నంబరు (18001800404) కేటాయించింది.
  • 11న పరిశుభ్రతపై ప్రేరణ కలిగించేలా, ప్రజలంతా ఉద్యమించేలా గ్రామాల్లో గోడలపై చిత్రాలు (వాల్‌ పెయింటింగ్‌) గీయించాలి. దీనికి సంబంధించి 5 చిత్రాల నమూనాలను జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే పంపారు.
  • 12న మొక్కలు నాటడం, శ్రమదానం నిర్వహించాలి.
  • 13న ‘నా గ్రామం మురికి రహితం’ అంశంపై 6, 7 తరగతుల విద్యార్థులకు పెయింటింగ్‌; 9, 10 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలి.
  • 14న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలి.
  • 15న గ్రామసభలు నిర్వహించి ప్రమాణం చేయించాలి. స్థానికంగా మరిన్ని ప్రయోగాత్మక కార్యక్రమాలు కూడా చేపట్టవచ్చు.

ABOUT THE AUTHOR

...view details