సంక్రాంతికి భారీ ఎత్తున కోడి పందేలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని కోడి పందాల నిర్వాహకులు.. బరుల దగ్గరకు వచ్చే వారి కోసం ఓ క్రేజీ ఆఫర్ ఇచ్చారు. వీక్షకులు ఆకలితో వెళ్లకూడదని ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. అదీ కోడి మాంసంతో.
ఫ్రీ చికెన్: కోడి పందేల్లో క్రేజీ ఆఫర్.. తిండి విషయంలో బేఫికర్
పండగ వచ్చిందంటే చాలు ఆఫర్ల కోసం ఎదురుచూడడం మాములే. సంక్రాంతికైతే ఆ నిరీక్షణ కొంచెం ఎక్కువే. అయితే.. ఇదంతా ఎలక్ట్రానిక్ ఉపకరణాలకో, ఇంటి సామగ్రికో చూస్తుంటాం. కానీ.. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో కోడి పందేల నిర్వాహకులు మాత్రం వింత ఆఫర్ అమల్లో పెట్టారు. అదేంటో చదవి.. చూసేయండి మరి!
కోడి పందేల్లో క్రేజీ ఆఫర్.. తిండి విషయంలో బేఫికర్
ఇంకేముంది వందల సంఖ్యలో పందేల రాయుళ్లు భోజనం కోసం బారులు తీరారు. పండగ పూట ఆనందంగా గడపడానికి వచ్చి ఆకలితో ఉండకూడదని ఖర్చుకు వెనకాడకుండా ఈ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
ఇదీ చదవండి :అడవిలో కోడి పందేలు.. 15 మంది అరెస్టు