చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఉద్దేశించిన కార్యక్రమంలో 2010 నుంచి అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఏపీ ప్రభుత్వం... దర్యాప్తు బాధ్యతను సీఐడీకి అప్పగించింది. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు ఆసక్తికరంగా సాగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నేత లాకర్లో దాదాపు 2 కేజీల బంగారం లభించినట్లు తెలుస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గతంలో ఆప్కో ఛైర్మన్గా పనిచేసిన గుజ్జల శ్రీనివాసులు నివాసంలో సీఐడీ అధికారులు ఇటీవల సోదాలు చేసి బంగారం, నగదు, విలువైన పత్రాలను సీజ్ చేశారు.
ఈ క్రమంలోనే సీఐడీ అధికారులు ఒక లాకర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు గుజ్జల కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడం వల్ల తెరవలేదని సమాచారం. ఆ లాకర్ను అలాగే తీసుకొచ్చి ఏపీ కడప జిల్లా కేంద్రంలోని ఖజానాలో భద్రపరిచినట్లు తెలిసింది. అప్పటి నుంచి దాన్ని తెరిచేందుకు సహకరించాలని గుజ్జల శ్రీనివాసులు కుటుంబాన్ని అధికారులు కోరుతున్నారు.