తెలంగాణ

telangana

ETV Bharat / city

పెన్నానదిలో ఏడుగురు గల్లంతు.. 4 మృతదేహాలు లభ్యం

సరదాగా స్నానం చేయడానికి పెన్నా నదిలో దిగి ఏడుగురు గల్లంతయ్యారు. స్నానం చేసేందుకు 8 మంది నదిలో దిగారు. ఈ క్రమంలో వీరంతా ఒక్కసారిగా మునిగిపోయారు.

By

Published : Dec 18, 2020, 10:08 AM IST

Updated : Dec 18, 2020, 10:49 AM IST

పెన్నానదిలో ఏడుగురు యువకులు గల్లంతు.. 4 మృతదేహాలు లభ్యం
పెన్నానదిలో ఏడుగురు యువకులు గల్లంతు.. 4 మృతదేహాలు లభ్యం

సరదాగా స్నానం చేయడానికి పెన్నా నదిలో దిగి ఏడుగురు గల్లంతయ్యారు. ఏపీలోని కడప జిల్లా సిద్ధవటంలో దిగువపేటకు చెందిన వెంకటశివ తండ్రి చంద్రశేఖర్‌ వర్థంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన వెంకట శివ స్నేహితులు 10 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మొత్తం శివతో కలిపి 11 మంది పెన్నా నది దగ్గరకు వెళ్లారు. అందులో 8 మంది సరదాగా స్నానం చేసేందుకు నదిలో దిగారు. ఈ క్రమంలో వీరంతా ఒక్కసారిగా మునిగిపోయారు. అతికష్టం మీద వెంకట శివ నది నుంచి బయటపడగా.. మిగతా ఏడుగురు గల్లంతయ్యారు.

గల్లంతైన వారిలో సోమశేఖర్‌, యశ్వంత్‌, తరుణ్, జగదీశ్, రాజేశ్‌, సతీశ్‌, షన్ను ఉన్నారు. గల్లంతైన వారిలో నలుగురి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మరో ఇద్దరి కోసం పోలీసులు, గజఈతగాళ్లు గాలింపు ముమ్మరం చేశారు.

Last Updated : Dec 18, 2020, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details