తెలంగాణ

telangana

By

Published : Dec 22, 2020, 10:42 PM IST

ETV Bharat / city

పర్యవేక్షణ లేకపోవడం వల్ల కల్తీ దందా సాగుతోంది: పద్మనాభరెడ్డి

జీహెచ్​ఎంసీలో ఫుడ్​ ఇన్​స్పెక్టర్ల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని... సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి కేటీఆర్​కు లేఖ రాశారు. పర్యవేక్షణ లేకపోవడం వల్ల రసాయనాలతో పండ్లను మాగబెట్టడం, ఆహార పదార్థాల కల్తీ దందా పెద్ద ఎత్తున సాగుతోందన్నారు.

forum for good governance secretary padmanabha reddy wrote letter to ktr for food inspector recruitment
పర్యవేక్షణ లేకపోవడం వల్ల కల్తీ దందా సాగుతోంది: పద్మనాభరెడ్డి

జీహెచ్ఎంసీలో ఖాళీగా ఉన్న ఫుడ్ ఇన్​స్పెక్టర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి... పురపాలక మంత్రి కేటీఆర్​కు లేఖ రాశారు. ఆహార పదార్థాల కల్తీ, రసాయనాలతో పండ్లను మాగబెడ్తున్నారని... వీటిని నిరోధించడానికి అవసరమైన పర్యవేక్షణ అధికారులు లేకపోవడం వల్ల ఈ దందా పెద్ద ఎత్తున సాగుతోందని ఆయన పేర్కొన్నారు. రసాయనాలను ఉపయోగించి పండ్లను పండించడం పట్ల హైకోర్టు తీవ్రంగా స్పందించినా ప్రభుత్వంలో ఎలాంటి స్పందనా లేదని ఆరోపించారు.

జీహెచ్ఎంసీలో కేవలం ముగ్గురు ఫుడ్ ఇన్​స్పెక్టర్లతో నెట్టుకొస్తున్నారని, 20 మంది ఫుడ్ ఇన్​స్పెక్టర్లను టీఎస్పీఎసీ ద్వారా ఎంపిక చేసినా... నేటికీ వాళ్లకు పోస్టింగులు ఇవ్వలేదనే విషయాన్ని పద్మనాభరెడ్డి గుర్తు చేశారు. కల్తీ పరీక్షలు నియంత్రించే మరో ల్యాబ్​ను ఏర్పాటు చేయాలని, ఫుడ్ ఇన్​స్పెక్టర్లను తొందరగా నియమించాలని మంత్రిని కోరారు.

ఇదీ చూడండి:'ఐదారేళ్లలో ఆయుధ సంపత్తిలోనూ స్వయం సమృద్ధి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details