ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలపై మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి స్పందించారు. ఓటర్లు అందరి వద్ద డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో స్తోమత లేకున్నా ఆధిపత్యం కోసమే అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఏపీ సీఎస్ను మారుమూలకు బదిలీ చేశారని అన్నారు. సీఎస్ బదిలీ తీరుపై ఐఏఎస్ అధికారులకు వణుకు పుడుతోందని దివాకర్ రెడ్డి తెలిపారు.
పంచాయతీ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంచారు: జేసీ - jc diwaker reddy comments on ysrcp governments
గ్రామాల్లో ఆధిపత్యం కోసం... ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఓటుకు విచ్చలవిడిగా డబ్బులు పంచారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో డబ్బు పంచకుండా ప్రధానమంత్రి గెలిచినా.. తన ఆస్తి మొత్తం వదిలేస్తానని ఆయన వ్యాఖ్యానించారు.
![పంచాయతీ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంచారు: జేసీ jc diwaker reddy comments on panchayath elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10742967-641-10742967-1614071348612.jpg)
పంచాయతీ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంచారు: జేసీ
Last Updated : Feb 23, 2021, 8:00 PM IST