తెలంగాణ

telangana

By

Published : Jan 7, 2021, 5:10 PM IST

ETV Bharat / city

ఎయిర్​పోర్టులో రగడ.. నిలదీసిన మాజీ ఎంపీ కుమారుడు

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయం సిబ్బందిపై మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడు శ్రీ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో పికప్​, డ్రాపింగ్​కు డబ్బులు వసూలు చేయడమేంటని ప్రశ్నించారు. వాహనాలు పార్కింగ్ చేయకుండా ఎలా డబ్బులు వసూలు చేస్తారని మండిపడ్డారు.

former-mp-harsha-kumar-son-fires-on-rajamahendra-varam-airport-staff
ఎయిర్​పోర్టులో రగడ.. నిలదీసిన మాజీ ఎంపీ కుమారుడు

ఎయిర్​పోర్టులో రగడ.. నిలదీసిన మాజీ ఎంపీ కుమారుడు

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయంలో పిక్అప్, డ్రాపింగ్​కు డబ్బులు వసూలు చేయడంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడు శ్రీ రాజ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల వద్ద కొత్త తరహా వసూళ్లు ఎందుకు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీరాజ్​కు అక్కడ ఉన్న మరికొంతమంది వ్యక్తులు మద్దతు తెలిపారు. ఓ సీఆర్​పీఎఫ్ అధికారి వచ్చి... ఇలా వసూలు చేయడంపై వివరణ ఇవ్వాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇలాంటి వసూళ్లను ప్రోత్సహించొద్దని అక్కడి వారందరికీ చెప్పిన హర్ష కుమార్ కుమారుడు శ్రీ రాజ్.. వందకుపైగా కారులను ఉచితంగాలోనికి పంపించారు.

ఇదీ చదవండి:పది రూపాయల కోసం ప్రాణాలు తీశాడు..

ABOUT THE AUTHOR

...view details