తెలంగాణ

telangana

By

Published : Aug 11, 2019, 10:03 AM IST

ETV Bharat / city

శ్రీశైలం వద్ద కట్టిపడేస్తున్న కృష్ణమ్మ పరవళ్లు..

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠానికి చేరిన కారణంగా.. వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. ఎగువన వస్తున్న ప్రవాహంతో జలాశయం వద్ద కృష్ణమ్మ సోగయం.. పర్యటకులను కట్టిపడేస్తోంది.

శ్రీశైలానికి భారీ వరద... 10 గేట్లు ఎత్తి సాగర్​కు విడుదల

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా... ప్రాజెక్టులోకి 6 లక్షల 60 వేల క్యుసెక్కుల వరద నీరు చేరుతోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా...ప్రస్తుతం 882.50 అడుగులు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గానూ... 202.04 టీఎంసీలకు చేరింది. జలాశయం ఔట్ ఫ్లో 8 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. హంద్రీనీవాకు 2,363 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 28 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ముచ్చుమర్రి నుంచి కేసీ కాలువకు 735 క్యూసెక్కులు తరలిస్తున్నారు. మరోవైపు పది గేట్ల ద్వారా నాగార్జున సాగర్‌కు 6.95 లక్షల క్యూసెక్కులు పంపుతున్నారు.

శ్రీశైలానికి భారీ వరద... 10 గేట్లు ఎత్తి సాగర్​కు విడుదల

ABOUT THE AUTHOR

...view details