తెలంగాణ

telangana

ETV Bharat / city

సీతాఫల్​మండి కార్పొరేటర్​ ఇంటి వద్ద వరద బాధితుల ఆందోళన - flood victims in Hyderabad

వరదల వల్ల నష్టపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్​లో వరద బాధితులు ఆందోళనకు దిగారు. సీతాఫల్​మండి కార్పొరేటర్ సామల హేమ ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేశారు.

flood victims protest at Sitaphalmandi corporator's home
సీతాఫల్​మండి కార్పొరేటర్​ ఇంటి వద్ద వరద బాధితుల ఆందోళన

By

Published : Dec 7, 2020, 12:30 PM IST

ఎన్నికల అనంతరం సాయం చేస్తామని చెప్పడం వల్ల వరద బాధితులు పెద్ద ఎత్తున మీసేవా కేంద్రాలు, కార్పొరేటర్ల ఇళ్ల వద్దకు చేరుతున్నారు. తమకు వరద సాయం అందించాలని కోరుతున్నారు.

సీతాఫల్​మండి కార్పొరేటర్​ సామల హేమ ఇంటి వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు. వరదల వల్ల నష్టపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ ఇంట్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వరద బాధితుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని సర్ది చెప్పి పంపించారు.

ABOUT THE AUTHOR

...view details