fight at golkonda: గోల్కొండ బోనాల ఉత్సవాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పంచ్లతో విరుచుకుపడ్డారు. ఇది చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులతో అమ్మవారిని కొలుచుకునేందుకు వచ్చిన వారికి ఇలాంటి గొడవలు చూసి భయాందోళనకు గురయ్యారు. ఇదంతా జరుగుతున్న పోలీసులు మాత్రం కానరాలేదు. గొడవలో గాయపడ్డ వారిని 108లో ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి పోకిరిల పైన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు.
గోల్కొండ బోనాల్లో ఘర్షణ.. భయాందోళనలో భక్తులు.. - golkonda bonalu fight
fight at golkonda: సంతోషంగా అమ్మవారికి బోనం సమర్పించుకుందామని వస్తే.. కొందరు ఆకతాయిల వల్ల భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. గోల్కొండ బొనాల వద్ద జరిగిన ఈ ఘటన భక్తులను భయాందోళనకు గురిచేసింది. బోనాల వద్దే రెండు గ్రూపులు పరస్పరం దాడులు చేసుకోవడంతో.. కోట ప్రాంగణంలో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.
![గోల్కొండ బోనాల్లో ఘర్షణ.. భయాందోళనలో భక్తులు.. fight at golkonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15727935-89-15727935-1656863540009.jpg)
fight at golkonda
గోల్కొండ బోనాల్లో ఘర్షణ.. భయాందోళనలో భక్తులు..