తెలంగాణ

telangana

ETV Bharat / city

రాజధాని తరలిపోతుందనే బెంగతో రైతు మృతి

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో అద్దేపల్లి కృపానందం అనే రైతు మృతి చెందాడు. గత పది రోజులుగా కృష్ణాయపాలెంలో జరుగుతున్న రైతుల ఆందోళనలో ఆయన పాల్గొన్నాడు. రాజధాని తరలిపోతుందనే బెంగతో గత రెండు రోజులుగా ఆందోళన చెందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం తమకు ఉన్న అర ఎకరం పొలం ఇచ్చామని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇప్పుడు రాజధాని తరలిపోతే తమ భవిష్యత్ అంధకారం అవుతుందనే ఆందోళనతో గుండెపోటుకు గురై... తన తండ్రి మృతి చెందాడని ఆయన కుమారుడు బుల్లిబాబు చెప్పాడు.

By

Published : Jan 8, 2020, 3:26 PM IST

farmer-died-at-amaravati-protest
రాజధాని తరలిపోతుందనే బెంగతో రైతు మృతి

రాజధాని తరలిపోతుందనే బెంగతో రైతు మృతి

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details