విత్తన రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రశంసించింది.
ఇటలీలోని ఐక్య రాజ్య సమితి, ఎఫ్ఏఓ అగ్రికల్చర్ అండ్ కన్సూమర్ ప్రొటెక్షన్ ఆసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డా.బూకార్ టిజానీ, ఎఫ్ఏఓ విత్తన విభాగం ప్రతినిధి, డా.చికెలు బాతో తెలంగాణ సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్(ఇస్టా) వైస్ ప్రెసిడెంట్ డా. కేశవులు సమావేశమయ్యారు.
ఇస్టా వైస్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి ఎఫ్ఏఓలో అత్యున్నత స్థాయి సమావేశాలకు డా.కేశవులు హాజరయ్యారు. తెలంగాణ విత్తన పరిశ్రమ, రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ఎఫ్ఏఓకు వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.
తెలంగాణ చేపడుతున్న సీడ్ బౌల్ కార్యక్రమాలను... ఆసియా, ఆఫ్రికా దేశాలలో అమలు పరచి విత్తన రంగాన్ని పటిష్ఠపరుస్తామని ఎఫ్ఏఓ ప్రకటించింది.