తెలంగాణ

telangana

By

Published : Jun 29, 2021, 10:16 AM IST

ETV Bharat / city

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ సంతోష్​కుమార్​

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌​ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శ్రీనివాస్ రావు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రముఖులకు ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తెలుగు రాష్ట్రాలు ప్రకృతిశోభతో, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి చెందలని స్వామివారిని ప్రార్థించినట్లు సంతోష్‌​ కుమార్ తెలిపారు

ఇదీ చదవండి:POWER WAR: ఇరురాష్ట్రాల మధ్య విద్యుత్​ పంచాయితీగా మారిన జల వివాదం

ABOUT THE AUTHOR

...view details