తెలంగాణ

telangana

By

Published : Feb 14, 2020, 11:11 AM IST

ETV Bharat / city

జాయింట్ కలెక్టర్​ను...భూములు క్రమబద్ధీకరణ చేయిస్తా!

భూముల క్రమబద్ధీకరణ చేయిస్తానని నమ్మించి మోసం చేసిన ఓ నకిలీ ఐ.ఎ.ఎస్‌.ను ఆంధ్రప్రదేశ్​ విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విశాఖలో కలెక్టరేట్​లో జేసీ-3గా పని చేస్తున్నానని చెప్పి పలువురు దగ్గర డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

fake-ias-arrest-by-vishaka-polic
జాయింట్ కలెక్టర్​ను...భూములు క్రమబద్ధీకరణ చేయిస్తా!

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్-3గా పని చేస్తున్నానని.. భూముల క్రమబద్ధీకరణ చేయిస్తానని నమ్మించి మోసం చేసిన ఓ నకిలీ ఐ.ఎ.ఎస్‌.ను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎయిర్‌పోర్టు పోలీసుస్టేషన్‌లో మురళీనగర్‌కు ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. శ్రీకాకుళం జల్లా పాతపట్నంకు చెందిన జి.అనిల్‌కుమార్‌ విశాఖ కలెక్టరేట్‌లో జేసీ-3 అని చెప్పుకుని కలెక్టరేట్‌లో స్పందనకు భూ సంబంధిత అంశాలపై వచ్చిన బాధితులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

లింక్​డ్​ ఇన్​లో నకిలీ ఖాతా

మధ్యవర్తిత్వంతో రంగంలోకి

మూర్తి అనే మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని బాధితుల వద్దకు మధ్యవర్తిత్వం నడిపి వారి సమస్యలను ఐ.ఎ.ఎస్‌. హోదాలో పరిష్కరిస్తానని చెప్పి కొంతమొత్తం తీసుకుంటున్నట్లు విచారణలో గుర్తించారు. మురళీనగర్‌కు చెందిన బాబ్జీ నుంచి ఎన్‌.ఎ.డి. కొత్తరోడ్డు సమీపంలో స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు రూ. 2.50 లక్షలు తీసుకొని కనిపించకపోవడం వల్ల అనుమానం వచ్చిన బాబ్జీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అనిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతని వద్ద ఐ.ఎ.ఎస్‌. అని గుర్తింపుకార్డు ఉన్నట్లు సమాచారం. ఇతని బారిన పడిన వారు ఎంతమంది ఉన్నారనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసులు ఒకట్రెంటు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది.

ఇదీ చదవండి : రాజధానుల ప్రకటనతో స్థిరాస్తి రంగానికి ఎదురుదెబ్బ

ABOUT THE AUTHOR

...view details