ఐఐటీల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్(JEE Advanced exam 2021) కఠినంగా ఉందని నిపుణులు స్పష్టం చేశారు. గత ఏడాది పరీక్షతో పోల్చుకున్నా కష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈసారి ఉదయం జరిగిన పేపర్-1 కంటే మధ్యాహ్నం జరిగిన పేపర్-2 ప్రశ్నపత్రం కష్టంగా ఉందని పేర్కొన్నారు.
అధిక శాతం మంది విద్యార్థులు గణితం ప్రశ్నలకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చిందని, రసాయనశాస్త్రం(chemistry exam) ప్రశ్నలు క్లిష్టంగాను, భౌతికశాస్త్రం(physics questions) మధ్యస్తంగానూ ఉన్నాయని శ్రీచైతన్య జేఈఈ(JEE Advanced exam 2021) జాతీయ డీన్ ఎం.ఉమాశంకర్ చెప్పారు. మొత్తంమీద సగటు విద్యార్థికి ఈ పరీక్ష(JEE Advanced exam 2021) చాలా కఠినంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రసాయనశాస్త్రం మార్కులు ఈసారి ఉత్తమ ర్యాంకును నిర్ణయిస్తాయన్నారు. సగటున 18 శాతం మార్కులు అంటే.. 360కి 65 వస్తే జనరల్ కేటగిరీ విద్యార్థులు అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణులై కౌన్సెలింగ్కు అర్హత సాధిస్తారని అంచనా వేశారు. పేపర్-1, 2లో గణితం ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయని విజయవాడకు చెందిన శారదా విద్యాసంస్థల నిపుణుడు విఘ్నేశ్వరరావు చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 25 వేల మంది పరీక్ష రాశారు. కొందరు విద్యార్థులు 310కి పైగా మార్కులు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.