తెలంగాణ

telangana

By

Published : Oct 15, 2020, 5:01 PM IST

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHRAT TOP TEN 5PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @5PM

1. వరదలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి​ సమీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలు, వరదలపై ప్రగతిభవన్‌లో సమీక్షించేందుకు... సీఎం కేసీఆర్‌ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుతం తీసుకుంటున్న, భవిష్యత్‌తో చేపట్టాల్సిన చర్యల, పునరావాస చర్యలు, కేంద్రానికి పంపాల్సిన నివేదికపై ప్రధానంగా చర్చిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. లైవ్ వీడియో: తిరగబడ్డ బోటు.. రక్షించిన సహాయక సిబ్బంది

భారీ వర్షాలతో హైదరాబాద్​ నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో టోలీచౌకీ విరాసత్​నగర్​లో వరద నీటిలో చిక్కుకున్న బాధితులను తరలిస్తుండగా.. ఒక్కసారిగా బోటు తిరగబడింది. ఊహించని పరిణామంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ముంపు ప్రాంతాల్లో కిషన్​రెడ్డి పర్యటన

వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో జీహెచ్​ఎంసీ పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమై... ప్రజలు తీవ్రం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. బ్యాంకు నిధులు కాజేసిన కేసులో మేనేజరుకు జైలు శిక్ష

మెదక్‌ జిల్లా ఆంధ్రా బ్యాంకు భానూర్‌ బ్రాంచ్ మాజీ మేనేజరుకి సీబీఐ కోర్టు శిక్ష విధించింది. బ్యాంకు నిధులు కాజేసినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మేనేజరు డి.నరసింహారెడ్డికి మూడేళ్ల పాటు జైలు శిక్ష, రూ. లక్షన్నర జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. కవి దిగ్గజం అచ్యుతన్​ కన్నుమూత

ప్రముఖ మలయాళ కవి అక్కితం అచ్యుతన్​ నంబూదిరి త్రిశూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. 94ఏళ్ల ఆయన మలయాళ సాహితీ లోకానికి ఎనలేని సేవలందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'లోక్​పాల్​​ ఆదేశాలను సమీక్షించే అధికారం లేదు'

లోక్​పాల్​ బెంచ్​ జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించే అధికారం ఆ వ్యవస్థకు లేదని లోకాయుక్త చట్టాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ నివేదించింది. సమీక్షకు అధికారం కల్పించేలా చట్ట సవరణ చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. చైనాకు ఆ ద్వీపాలు అమ్మేస్తున్న పాక్!

పాకిస్థాన్​ ప్రభుత్వం జారీ చేసిన ఓ ఆర్డినెన్స్​పై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. దేశానికి చెందిన రెండు ద్వీపాలను చైనాకు అమ్మేయడం కోసమే ఈ ఆర్డినెన్స్​ను తీసుకొచ్చినట్టు పాక్​లోని విపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామని తేల్చిచెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. కుప్పకూలిన మార్కెట్లు- 1,066 పాయింట్లు డౌన్

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,066, నిఫ్టీ 291 పాయింట్లు పతనమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. వివేక్​ ఒబెరాయ్​ ఇంట్లో సీసీబీ సోదాలు

బాలీవుడ్​ నటుడు వివేక్​ ఒబెరాయ్​ ఇంట్లో బెంగళూరు సీసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కన్నడ చిత్రసీమ డ్రగ్స్​ కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఆదిత్య అల్వా పరారీలో ఉండటం వల్ల.. అతని బంధువైన సదరు హీరో ఇంటిలో అధికారులు తనిఖీలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'ఒగ్గేసి పోకే అమృత' అంటోన్న తేజ్

మెగా మేనల్లుడు సాయిధరమ్​ తేజ్ నటిస్తోన్న 'సోలో బ్రతుకే సో బెటర్'​ సినిమాలోని ఓ పాటను రిలీజ్​ చేశారు దర్శకుడు సుబ్బు. ఈరోజు తేజ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్​ అయిన ఈ పాట శ్రోతల్ని అలరిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details