1. హైదరాబాద్ మేయర్కు కరోనా పాజిటివ్
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్కు కరోనా పాజిటివ్ నిర్ధరణయింది. శనివారం మేయర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ మేయర్ బొంతు రామ్మోహన్కు కరోనా పాజిటివ్ వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మొక్కలు తిన్న మేకలు.. యజమానులకు జరిమానా
ఖమ్మం జిల్లా కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు తిన్న ఏడు మేకలను పురపాలక సిబ్బంది బంధించింది. సోమవారంలోపు మేకకు మూడు వేల చొప్పున జరిమానా చెల్లించి తీసుకు వెళ్లాలని కమిషనర్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మోసపోతున్న అమాయకులు
పోలీసులు, మీడియా ఎంత అవగాహన కల్పించినా కొంత మంది మోసపోతూనే ఉన్నారు. అమాయకత్వంతో సైబర్ నేరగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కాంగ్రెస్ శ్రేణుల అరెస్టు
దళిత కుటుంబానికి చెందిన రేవల్లి రాజాబాబు హత్యకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం తలపెట్టిన ఛలో మల్లారం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భూపాలపల్లి జిల్లాలోని మల్లారం గ్రామానికి తరలివెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 3 వేల మంది కరోనా రోగులు మిస్సింగ్
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న కర్ణాటక బెంగళూరులో 3 వేల మందికి పైగా కరోనా రోగుల ఆచూకీ గల్లంతవడం కలకలం రేపుతోంది. ఏం చేయాలో దిక్కుతోచక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వారి జాడ కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.