21 రోజుల్లోనే రెట్టింపు కేసులు!
భారత్లో కొవిడ్ ఉగ్రరూపం కొనసాగుతోంది. రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూ.. కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు వెలుగుచూశాయని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
త్యాగానికి ప్రతీక బక్రీద్
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ త్యాగానికి ప్రతీక అని.. ఇస్లాం సంప్రదాయంలో ఈ పండుగకు ప్రత్యే స్థానముందన్నారు. కొవిడ్ నేపథ్యంలో అందరూ నిబంధనలకు లోబడే పండుగను జరుపుకోవాలని తమిళిసై తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనాకు చంపే శక్తి లేదు
కరోనా వైరస్కు మనిషిని చంపే శక్తి లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల అన్నారు. అప్రమత్తంగా లేకుంటేనే ప్రాణహాని ఉంటుందన్నారు. కొవిడ్ నియంత్రణకు ఎంతైనా ఖర్చుచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈటల స్పష్టం చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రూనాట్ పరీక్షల కేంద్రం, మమత ఆస్పత్రిలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ను మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామ, ఎమ్మెల్యే సండ్రతో కలిసి ఈటల ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కల్పించాలి
తెరాస ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎస్టీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోతోందని ఉత్తమ్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలు, గిరిజనులపై ప్రతిరోజు ఏదో ఓ చోట హింసాకాండ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పోరాటం చేస్తాం
ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.