1. ఆగని పెట్రో వాత.. 21వ రోజూ ధరలు పైపైకి
దేశంలో వరుసగా 21వ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర శనివారం 25 పైసలు పెరిగి రికార్డు స్థాయికి చేరింది. డీజిల్ ధర లీటర్పై దాదాపు 21 పైసలు పెరిగింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
2. రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 237కు చేరిన మరణాలు
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం తాజాగా 985 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 12,349కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
3. కరోనా ఎఫెక్ట్: అయోమయంలో అంకుర సంస్థలు
కరోనా అన్ని రంగాలనూ కుదిపేస్తోంది. అంకుర సంస్థలపైనా దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఆదాయం తగ్గిపోవడం, నిర్వహణకు తగిన నిధులు లేకపోవడం వల్ల గత రెండేళ్లలో ఏర్పాటైన కొన్ని అంకురాల (స్టార్టప్ల) కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోగా.. మరికొన్ని మూసివేత దిశగా వెళ్తున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
4. అమానవీయ ఘటనపై సీఎంవో తీవ్ర ఆగ్రహం
ఏపీలోని పలాసలో అధికారులు మానవత్వాన్ని మరిచారు. నిబంధనలు తుంగలో తొక్కి.. కరోనా రోగి మృతదేహాన్ని జేసీబీతో తరలించారు. అధికారుల తీరుపై విమర్శలు గుప్పుమన్నాయి. ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
5. ఆకాశమే హద్దుగా అంతరిక్ష ప్రయోగాలు
అంతరిక్షరంగంలో ప్రయోగాలను విస్తరించేందుకు ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తున్నప్పుడు మిశ్రమ స్పందన లభించింది. ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ మాధవన్ నాయర్ లాంటివారూ దీనిని వ్యతిరేకించారు. అయినప్పటికీ కేంద్ర మంత్రి వర్గం తాజా సంస్కరణలకే మొగ్గుచూపింది. ఫలితంగా ఉపగ్రహ ప్రయోగ సేవలు, రాకెట్లు మొదలగు నిర్మాణ ప్రక్రియ మరింత వృద్ధి చెందుతుందని ఇస్రో ఛైర్మన్ శివన్ అంటున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.