తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @9PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 9PM NEWS
టాప్‌టెన్‌ న్యూస్‌ @9PM

By

Published : Nov 21, 2020, 8:59 PM IST

1. 90 నామినేషన్లు తిరస్కరణ

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన పూర్తైంది. 90 నామినేషన్లు ఆర్వోలు తిరస్కరించారు. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. మేం ఎంతో చేశాం: కేటీఆర్

ఆరేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్కపనైనా చెప్పాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. రోడ్​షోల ద్వారా జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన కేటీఆర్... తెరాస సర్కార్ పాలనలో భాగ్యనగర అభివృద్ధికి ఎంతో చేశామని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ ఆలస్యం

ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం అయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 23వ తేదీ నుంచి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. అగ్నిప్రమాదం.. 2 కోట్ల నష్టం

సూర్యాపేట జిల్లాలోని కాటన్​ జిన్నింగ్​ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 2 వేల 800 క్వింటాల పత్తి దగ్ధమైంది. దాదాపు రెండు కోట్ల రూపాయల నష్టం జరిగిందని కాటన్​ మిల్లు యాజమాన్యం అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. తెరాస హామీలపై రేపు ఛార్జ్​షీట్ విడుదల​ : కిషన్​ రెడ్డి

గత జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హామీలు అమలు కాలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. రేపు ఉదయం తెరాస హామీలపై ఛార్జ్​షీట్​ విడుదల చేస్తామని చెప్పారు. ఈ ఛార్జ్​షీట్​ను కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్​ జవడేకర్​ విడుదల చేస్తారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. చెన్నై మెట్రోకు అమిత్ షా శంకుస్థాపన

తమిళనాడు రాజధాని చెన్నైలో మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ పనులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. చెన్నైలోని లీలా ప్యాలెస్​లో జరిగిన కార్యక్రమంలో తిరువళ్లూరు జిల్లాలో నిర్మించిన రిజర్వాయర్​ను ప్రజలకు అంకితమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'ఉగ్రదాడి ప్రణాళిక ప్రకారమే'

జమ్ముకశ్మీర్​లో జరిగిన నగ్రోటా ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి పాకిస్థాన్​ ఐఎస్​ఐ అని ప్రభుత్వ ఉన్నత వర్గాలు వెల్లడించాయి. బావల్​పుర్​లో ఉగ్రవాద ఈ ప్రణాళికను రూపొందిచినట్లు తేల్చాయి. కశ్మీర్​లో ఎన్నికలు జరుగనున్న ఎన్నికలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు నిర్ధరించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'బైడెన్​కే ఆ ఖాతా'

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించే జనవరి 20న అధికారిక ఖాతా '@POTUS'ను బదిలీ చేస్తామని ట్విట్టర్ ప్రకటించింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించకపోయినా.. బైడెన్​కు అప్పగిస్తామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఐపీఎల్‌తో మేలు: షమి

ఐపీఎల్​లో ప్రదర్శన తనలో ఆత్మవిశ్వాసం పెంచినట్లు వెల్లడించాడు టీమ్​ఇండియా పేసర్​ మహ్మద్​ షమి. సొంతగడ్డపై కంగారూలను ఓడించగల ఆటగాళ్లు భారత్‌లో ఉన్నారని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. డ్రగ్స్​ కేసులో హాస్యనటి అరెస్టు

ప్రముఖ హాస్యనటి భారతీ సింగ్‌ను ఇవాళ అరెస్ట్‌ చేసింది ఎన్‌సీబీ. డ్రగ్స్​ కేసులో విచారణ అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు అధికారులు. గంజాయి సేవించినట్లు భారతీసింగ్‌, ఆమె భర్త అంగీకరించినట్లు సమాచారం.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details