1. జీహెచ్ఎంసీలో 2, 226 నామినేషన్లు
జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. మూడ్రోజులపాటు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. గ్రేటర్ ఎన్నికలకు చివరిరోజు 1,561 నామపత్రాలు దాఖలయ్యాయి. నామినేషన్లు వేసిన అభ్యర్థులతో జోనల్ కమిషనర్ కార్యాలయాలు కిటకిటలాడాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అభివృద్ధిని ప్రచారం చేయండి: కేటీఆర్
హైదరాబాద్ అభివృద్ధిపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... ప్రగతి నివేదిక విడుదల చేశారు. 150 డివిజన్లలో సగం డివిజన్లు మహిళలకు ఇవ్వాలని సీఎం చట్టం తెచ్చారని మంత్రి వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 85 డివిజన్లు మహిళలకే కేటాయించినట్లు స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. భాజపా విజయం కోసం పనిచేస్తాం: పవన్
జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి వైదొలుగుతున్నామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కార్యకర్తలు నిరుత్సాహం చెందవద్దని ఆయన కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా గెలవాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలు భాజపా విజయం కోసం పనిచేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మంత్రోచ్ఛారణల నడుమ పుష్కరాలు
వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ తుంగభద్ర పుష్కరాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ వద్ద మాధవా నందస్వామి, కమలానందభారతి స్వామిజీ పుష్కరాలను ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కేసీఆర్ వ్యాఖ్యలపై బండి ఫైర్
వరద సాయంపై ఎస్ఈసీకి భాజపా లేఖరాసినట్టు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ముందుగా చెప్పినట్టుగానే మధ్యాహ్నం 12 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.