తెలంగాణ

telangana

By

Published : Mar 15, 2021, 6:59 PM IST

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 7PM NEWS
టాప్​టెన్ న్యూస్ @7PM

1. 'సభలో తీర్మానం చేయాలి'

సాగు చట్టాలపై సభలో తీర్మానం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు. 30 రోజుల పాటు బడ్జెట్​ సమావేశాలు నిర్వహించాలని కోరినా.. కొవిడ్​ పేరు చెప్పి కుదిస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. రూ.8 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

విశ్వసనీయ సమాచారం ప్రకారం డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుల నుంచి 140 కిలోల అల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నట్లు బాలానగర్ డీసీపీ పద్మజ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'ఈనాడు ప్రాపర్టీ షో'

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న ‘ఈనాడు ప్రాపర్టీ షో’ మరలా మీ ముందుకు వచ్చేసింది. ఇప్పటికి ౩౦ ఎడిషన్స్ విజయవంతంగా నిర్వహించిన ‘ఈనాడు ప్రాపర్టీ షో’ తన 31వ ఎడిషన్ హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఏప్రిల్ 3, 4వ తేదీల్లో నిర్వహిస్తోంది. ఇది హైదరాబాద్​లోనే అతి పెద్ద ప్రాపర్టీ షోగా నిలవనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'విచారణ అవసరం లేదు'

సచివాలయంలో మసీదుల కూల్చివేతపై హైకోర్టు విచారణ ముగించింది. మసీదులు నిర్మిస్తామని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ వివరణను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం... ప్రభుత్వం హామీ ఇచ్చినందున విచారణ అవసరం లేదని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఆ ఎన్​కౌంటర్​ కేసులో ఉరిశిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 'బాట్లా హౌస్​ ఎన్​కౌంటర్'​ కేసులో దోషిగా తేలిన అరిజ్​ ఖాన్​కు ఉరిశిక్ష విధించింది దిల్లీ కోర్టు. ఈ కేసును అత్యంత అరుదైనదిగా అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'అమ్మడమే నిర్మించడం రాదు'

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.. భాజపా ప్రభుత్వంపై మరోమారు విరుచుకుపడ్డారు. వివిధ విమానాశ్రయాల్లోని ప్రభుత్వ వాటాను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని.. అది ప్రజలకు భారీగా నష్టం కలిగిస్తుందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'మమతా నామినేషన్​ తిరస్కరించండి'

మమతా బెనర్జీ నామినేషన్​ తిరస్కరించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు సువేందు అధికారి. మమతపై ఉన్న ఆరు క్రిమినల్​ కేసులను వెల్లడించలేదని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'ఆ​ ప్రతిపాదనే లేదు'

ఇంధన ధరలకు కళ్లెం వేసేలా పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావచ్చన్న వార్తలను మరోసారి కేంద్రం తోసిపుచ్చింది. పెట్రోల్, డీజిల్, జెట్‌ ఇంధనం, సహజ వాయువులను వస్తుసేవల పన్ను పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనేదీ ప్రస్తుతం తమ వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'డబ్బు ఎక్కువ ఇచ్చారని..'

ప్రొఫేషనల్​ క్రికెట్​ ఆడే ప్రతి ఆటగాడు ఒత్తిడికి లోనవుతారని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా పేసర్​ పాట్​ కమిన్స్​. ఐపీఎల్​ వేలంలో ఎక్కువ ధర పలికినంత మాత్రానా బౌలర్​కు అన్ని పరిస్థితులు కలిసి రాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'చావు కబురు చల్లగా'

కార్తికేయ, లావణ్య త్రిపాఠి నటించిన 'చావు కబురు చల్లగా'.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలతో పాటు పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు హీరో కార్తికేయ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details