తెలంగాణ

telangana

By

Published : Mar 11, 2021, 7:00 PM IST

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 7PM NEWS
టాప్​టెన్ న్యూస్ @7PM

1. రేపు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

75వ స్వాతంత్య్ర వార్షికోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్‌లో ఇప్పటికే అధికారులు సిద్ధం చేస్తున్నారు. రేపు ఉదయం 11 గం.కు సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఆ నాలుగు రోజులు నో వైన్స్​

ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వైన్సులు, బార్లు, కల్లు దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వాటిని మూసివేయాలని ఆయా కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. వారి వాహనంలో ప్రయాణిస్తే కేసు

తాగి వాహనాలు నడిపే వారితో పాటు డ్రైవర్​ తాగి ఉన్నాడని తెలిసి.. వాహనం ఎక్కిన వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు.. కోరమీసాల మల్లన్నను దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. 'మహా'లో కరోనా విజృంభణ'

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించటంపై ఆందోళన వ్యక్తం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. పరిస్థితులను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 170 మంది ఎమ్మెల్యేలు గుడ్​బై

2016-20 మధ్య జరిగిన ఎన్నికల సమయాల్లో మొత్తం 405 ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. అందులో అత్యధికంగా 170మంది కాంగ్రెస్​ నుంచే ఉన్నట్లు అసోసియేషన్​ ఫర్​​ డెమొక్రటిక్​ రిఫార్మ్స్​​(ఏడీఆర్​) వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. చైనా సిద్ధం

బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్​ నిర్మాణం కోసం వేగంగా సన్నాహాలు చేస్తోంది చైనా. బ్రహ్మపుత్రపై హైడ్రోపవర్​ ప్రాజెక్ట్​ నిర్మాణం సహా 60 కీలక ప్రతిపాదనలతో కూడిన 14వ పంచవర్ష ప్రణాళికకు ఆ దేశ పార్లమెంట్ గురువారం​ ఆమోద ముద్ర వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 170 దేశాల్లో ఇన్​స్టా లైట్​

ఫేస్​బుక్​ లైట్​ తరహాలో ఇన్​స్టాగ్రామ్​ లైట్​ అందుబాటులోకి వస్తోంది. 170 దేశాల్లో ఈ యాప్​ను విడుదల చేస్తున్నట్లు ఇన్​స్టా మాతృ సంస్థ ఫేస్​బుక్​ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. సునీల్​ ఛెత్రికి కరోనా

భారత ఫుట్​బాల్​ టీమ్​ కెప్టెన్​ సునీల్​ ఛెత్రికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా స్వయంగా వెల్లడించాడు సునీల్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'హరిహర వీరమల్లు'గా పవన్​

పవన్​-క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు 'హరిహర వీరమల్లు' టైటిల్​ పెట్టారు. శివరాత్రి కానుకగా ఫస్ట్​లుక్​ పోస్టర్​ను అభిమానులతో పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details