తెలంగాణ

telangana

By

Published : Mar 11, 2021, 4:59 PM IST

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 5PM NEWS
టాప్​టెన్ న్యూస్ @ 5PM

1. ఏడుగురు మృతి

బంగాల్​ ముర్షీదాబాద్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సుతి ప్రాంతంలో ఆటో, కారు ఢీకొని ఏడుగురు మరణించారు. 15 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. విశాఖ ఉక్కు సీఎండీకి నోటీసు

విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగుల ఆందోళన ఉద్ధృతమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. డ్రోన్​తో పిచికారి

వ్యవసాయ రంగంలో రైతుల అవసరాల మేరకు కొత్త ఆవిష్కరణలు రావాలని మంత్రి ఈటల రాజేందర్​ అభిప్రాయం వ్యక్తం చేశారు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో డ్రోన్‌ యంత్రంతో పంటలపై పురుగు మందుల పిచికారి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. యాప్‌ల కేసులో మరొకరు

రుణ యాప్‌ల కేసులో మరో నిందితుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో చిన్నబ్బ రాజశేఖర్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. సంయమనం పాటించాలి: దీదీ

నందిగ్రామ్‌లో జరిగిన దాడి విషయంలో పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని పశ్చిమబంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కోరారు. కొన్నిరోజులపాటు చక్రాల కుర్చీలో తిరుగాడాల్సి ఉంటుందని అందుకు కార్యకర్తల సహకారం కావాలన్నారు దీదీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'యువతే మార్పు తేగలరు'

సమాజాన్ని మార్చే విషయంలో విద్యావంతులే శక్తివంతమైన ఏజెంట్లు అని అభిప్రాయపడ్డారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కొవింద్​. దేశంలో విప్లవాత్మక మార్పులను విద్యావంతులే తీసుకురాగలరని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. తాజ్​​మహల్​లో పూజలు అరెస్టు

ప్రంపంచ ప్రఖ్యాత పర్యాటక క్షేత్రం తాజ్​మహల్​లో పూజలు నిర్వహించారనే ఆరోపణలతో ముగ్గురని అరెస్టు చేసింది సీఐఎస్​ఎఫ్​. ఈ అరెస్టులను ఖండిస్తూ ఆందోళనకు దిగారు హిందూ మహాసభ కార్యకర్తలు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఆ దుర్ఘటనకు పదేళ్లు

జపాన్​లో సునామీ వల్ల ఫుకుషిమా న్యూక్లియర్​ కేంద్రం ధ్వంసమై నేటికి పదేళ్లు. నాటి ప్రమాదంలో మరణించిన వారికి జపాన్ చక్రవర్తి, ప్రధాని నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. కన్నేసిన కోహ్లీ

అహ్మదాబాద్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరగనున్న టీ20 సిరీస్​ రికార్డులను వేదికగా కానుంది. అంతర్జాతీయ టీ20ల్లో 3 వేల మైలురాయికి టీమ్ఇండియా కెప్టెన్​ మరో 72 పరుగుల దూరంలో ఉండగా.. అంతర్జాతీయ క్రికెట్​లో 12 వేల పరుగుల నమోదు చేసేందుకు కోహ్లీ మరో 17 పరుగులు దూరంలో ఉండడం విశేషం.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. నవ్వించే 'జాతిరత్నాలు'!

మహాశివరాత్రి కానుకగా విడుదలైన 'జాతిరత్నాలు'.. ప్రేక్షకుల్ని నవ్వించిందా? ఇంతకీ సినిమా ఎలా ఉంది? ఎంతలా ఆకట్టుకుంది? తెలియాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details