తెలంగాణ

telangana

By

Published : Mar 10, 2021, 4:58 PM IST

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధనా వార్తలు

ETV BHARAT TOP TEN 5PM NEWS
టాప్​టెన్ న్యూస్ @5PM

1. ఉత్తరాఖండ్​ సీఎంగా తీరథ్​ ప్రమాణం

ఉత్తరాఖండ్​ సీఎంగా భాజపా సీనియర్​ నేత, గడ్వాల్​ ఎంపీ తీరథ్​ సింగ్​ రావత్​ ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'భైంసాలో సీఎం పర్యటించాలి'​

నిర్మల్​ జిల్లా భైంసాలో సీఎం కేసీఆర్​ పర్యటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. ఒక వర్గం వైపు మాత్రమే ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టిన భార్య

భర్త కనిపించడం లేదని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు. కానీ ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. భర్తని భర్యే హత్య చేసిన ఇంట్లోనే పూడ్చి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. వేములవాడలో హెలికాప్టర్ సేవలు

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధిలో హెలిటాక్సీ సేవలను ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. 14 వ తేదీ సాయంత్రం వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. సన్నబడాలనే వేధింపులతో ఆత్మహత్య

సన్నగా ఉండాలనే భర్త కోరికకు భార్య బలై పోయింది. లావుగా ఉన్నావని.. సన్నబడాలని అతని వేధింపులు తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్​​ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 254పాయింట్లు బలపడి 51,279 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 76 పాయింట్ల లాభంతో 15,174 పైకి చేరింది. ఐటీ షేర్లు లాభాలను గడించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. కోటి విలువైన బ్రౌన్​షుగర్​ పట్టివేత

ఒడిశాలో భారీ స్థాయిలో బ్రౌన్​ షుగర్​ను పట్టుకున్నారు పోలీసులు. దీని విలువ రూ.1కోటికి పైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసుకు సంబంధించి ఓ యువకుడిని అరెస్ట్​ చేసినట్టు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. కిలిమంజరోపై అంగన్​వాడీ వర్కర్​

ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన శిఖరం కిలిమంజరోను ఛత్తీస్​గఢ్​లోని అంగన్​వాడీ వర్కర్​ అమితా శ్రీవాస్​ అధిరోహించారు. మహిళా దినోత్సవం రోజున కిలిమంజరో శిఖరాగ్రాన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇది మహిళలందరి విజయమని ఆమె అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రేక్షకులు

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ను సౌథాంప్టన్​ వేదికగా నిర్వహించనున్నట్లు ఐసీసీ అధికారికంగా వెల్లడించింది. ఈ టెస్టును జూన్​ 18 నుంచి 22 మధ్య నిర్వహించనుండగా.. జూన్​ 23వ తేదీని రిజర్వ్​డేగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'శివరాత్రి' సినిమాలు ఇవే

థియేటర్​లో నవ్వులు పూయించేందుకు.. భావోద్వేగానికి గురి చేసేందుకు.. స్ఫూర్తి నింపేందుకు.. యాక్షన్​ ఘట్టాలతో అదరగొట్టేందుకు.. ఇలా పలు సినిమాలు శివరాత్రిని పురస్కరించుకొని ప్రేక్షలను పలకరించేందుకు సిద్ధమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details