తెలంగాణ

telangana

By

Published : Feb 25, 2021, 5:00 PM IST

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 5PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @5PM

1. రాష్ట్రానికి మరోసారి అవార్డులు

తెలంగాణకు మరోసారి స్కోచ్‌ అవార్డులు లభించాయి. స్కోచ్‌ ఇ-గవర్నెన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు రాష్ట్రం ఎంపికైంది. 2020కి గాను స్కోచ్ ఉత్తమ మంత్రి అవార్డుకు మంత్రి కేటీఆర్ ఎంపికయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'ఉస్మానియాను కొత్తగా నిర్మిస్తారా?'

ఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మాణంపై ఆరేళ్లుగా నిర్ణయం తీసుకోలేక పోతున్నారా అని... ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆస్పత్రి పునర్‌ నిర్మించాలంటూ దాఖలైన అన్ని వ్యాజ్యాలపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ఉత్తమ్ సమక్షంలో గొడవ

మహబూబాబాద్​లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ సన్నాహక సభ రసాభాసగా మారింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందే కాంగ్రెస్ నేతలు గొడవ పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఆ నిందితులకు పోలీసు కస్టడీ

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వామన్​రావు, నాగమణి హత్య కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ కోసం నిందితులను వరంగల్ జైలు నుంచి తీసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. రూ.80కోట్ల విద్యుత్​ బిల్లు

మహరాష్ట్ర పాల్ఘర్​కు చెందిన ఓ రైస్​మిల్లు యజమానికి రూ.80కోట్లకు పైగా విద్యుత్తు బిల్లు వచ్చింది. బిల్లు చూసి ఖంగు తిన్న ఆయన అధికారులను ఆశ్రయించగా... తప్పును సరిచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'కాంగ్రెస్​ది అధికార దాహం'

అసోం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలు దేశ జీడీపీలో అతిపెద్ద వాటాదారుగా అవతరించే వరకు భాజపా ప్రయాణం కొనసాగుతుందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. ఈ క్రమంలోనే కాంగ్రెస్​పై విమర్శలతో విరుచుకుపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'మహిళ ఆస్తిపై తండ్రి వారసులకూ హక్కు'

మహిళ ఆస్తిపై ఆమె తండ్రి వారసులకూ హక్కు ఉంటుందని అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఈ ఆస్తి మార్పిడి సరైనదే అని తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. యూకే కోర్టు కీలక తీర్పు

నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని యూకే కోర్టు కీలక తీర్పును వెలువరించింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఆ పరుగులకే భారత్​ ఆలౌట్​

అహ్మదాబాద్ టెస్టులో భారత్​ 145 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్​మెన్లలో 66 పరుగులు చేసిన రోహిత్​ శర్మ జట్టు టాప్​ స్కోరర్​. ఇంగ్లాండ్​ బౌలర్లలో రూట్ 5, లీచ్​ 4 వికెట్లు తీసుకున్నారు.​ పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'మోసగాళ్లు' ట్రైలర్

గురువారం విడుదలైన 'మోసగాళ్లు' ట్రైలర్ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. దీనితో పాటే 'విరాటపర్వం'లోని తొలి లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details