తెలంగాణ

telangana

By

Published : Jan 14, 2021, 4:59 PM IST

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 5PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @5PM

1. జైలుకు అఖిలప్రియ

ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో 3 రోజుల విచారణలో అఖిలప్రియ స్టేట్‌మెంట్​ను పోలీసులు రికార్డ్ చేశారు. భూ వివాదానికి సంబంధించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. జోరుగా కోడిపందేలు

పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో రోజు కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో పందెం రాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'ప్రపంచ దేశాల ఎదురుచూపు'

హైదరాబాద్ దోమలగూడలోని ఎన్టీఆర్ మైదానంలో పతంగుల ఉత్సవాన్ని భాజపా ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'పెట్రోల్లోనూ మార్క్ చూపించాలి'

కరీంనగర్​ డెయిరీ ఆధ్వర్యంలో పెట్రోల్​ ఫిల్లింగ్​ స్టేషన్​ను మంత్రి గంగుల కమలాకర్​ ప్రారంభించారు. పాలసేకరణలో నాణ్యత ప్రమాణాలను పాటించినట్లుగానే పెట్రోల్​ విక్రయంలోను పాటించాలని మంత్రి కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఆ యాప్​లపై వేటు

యూజర్ల భద్రతా నిబంధనలు ఉల్లంఘించి కార్యకలపాలు నిర్వహిస్తున్న రుణ యాప్​లను ప్లే స్టోర్​ నుంచి తొలగించినట్లు టెక్​ దిగ్గజం గూగుల్​ ప్రకటించింది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో అలాంటి యాప్​లను గుర్తించినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. రాసిపెట్టుకోండి.. : రాహుల్​

కొందరు వ్యాపారవేత్తల కోసం రైతులను నాశనం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 31న పల్స్ పోలియో

కొవిడ్​ వ్యాక్సినేషన్​ కారణంగా వాయిదా పడ్డ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈనెల 31న నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. రాష్ట్రపతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఆంక్షల నడుమ బైడెన్​ ప్రమాణం!

అమెరికా అధ్యక్షుడిగా ఈ నెల 20న బైడెన్​ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఇటీవల జరిగిన క్యాపిటల్​ హింసాకాండ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. 20 వేల మంది సాయుధ సిబ్బందిని క్యాపిటల్​ వద్ద మోహరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. నాలుగో టెస్టులో బుమ్రా!

ఆసీస్​తో నాలుగు టెస్టులో బుమ్రా ఆడే విషయం గురించి భారత జట్టు బ్యాటింగ్ కోచ్ మాట్లాడాడు. తుది జట్టును శుక్రవారమే ప్రకటిస్తారని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ప్రభాస్ ఫ్యాన్స్​కు శుభవార్త

డార్లింగ్ హీరో ప్రభాస్ 'సలార్'.. కనుమ రోజు లాంఛనంగా ప్రారంభం కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details