1. భారత్లో మరో 54 వేల కేసులు
దేశంలో ఒక్కరోజే 54 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 690 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నిర్ధరణ పరీక్షలు 10 కోట్లు దాటాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మధ్యాహ్నం పంటల కొనుగోలుపై కేసీఆర్ సమీక్ష
వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత సాగు విధానంపై సీఎం కేసీఆర్ మధ్యాహ్నం రెండున్నర గంటలకు సమీక్షించనున్నారు. పంటల కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ప్రశ్నించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. దీక్షిత్ కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి
మహబూబాబాద్లో హత్యకు గురైన దీక్షిత్రెడ్డి కుటుంబాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్ పరామర్శించారు. శనిగపురంలో బాలుడి తల్లిదండ్రులను కలిశారు. ధైర్యంగా ఉండాలని రంజిత్రెడ్డి, వసంతకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. సర్వభూపాల వాహనంపై శ్రీవారి అభయం
తిరుమలలో ఎనిమిదోరోజు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఎనిమిదోరోజు తిరుమలేశుడు సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కరోనా
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తనకు కరోనా సోకినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవని... ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. సిటీ సెంటర్ మాల్లో అగ్నిప్రమాదం
ముంబయిలోని సిటీ సెంటర్ మాల్లో గతరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా చెలరేగాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు.. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఐరాస@75- బహుదూరం
ఐరాస కొన్ని గణనీయ విజయాలు సాధించినా, కొవిడ్ను ఎదుర్కోవడానికి సమైక్య వేదికగా నిలవడంలో విఫలమైంది. ఐరాస అనుబంధ సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ సమైక్య పోరులో ఐక్యరాజ్యసమితి పత్తా ఎక్కడ? సమితి సమర్థ స్పందన ఏది?’ అంటూ నిలదీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. లాభాల్లో స్టాక్మార్కెట్లు
స్టాక్మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 172 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 40 వేల 730 ఎగువన ఉంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 50 పాయింట్లకుపైగా లాభంతో 11 వేల 950 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. క్రికెటర్లకు కరోనా
జింబాబ్వే జట్టులోని ఇద్దరు క్రికెటర్లతో పాటు ఇద్దరు సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. పాక్ పర్యటనలో భాగంగా ఇస్లామాబాద్లో చేసిన పరీక్షల్లో ఈ విషయం నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'ఫైటర్' కోసం రంగంలోకి..
కరోనా వల్ల ఆగిపోయిన విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ 'ఫైటర్' సినిమా చిత్రీకరణ డిసెంబర్లో మొదలు కానుంది. ఆ నెలలోనే విజయ్ సెట్లో అడుగుపెడతారని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.