తెలంగాణ

telangana

By

Published : Oct 20, 2020, 10:57 AM IST

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 11AM NEWS
టాప్​టెన్​ న్యూస్ @11AM

1. రాష్ట్రంలో మరో 1,486 కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 14 వందల 86 కరోనా కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కొవిడ్​ కేసుల సంఖ్య 2 లక్షల 24 వేల 545కు చేరగా.. 12 వందల 82 మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. భారీ వర్షాల ఎఫెక్ట్​: పాతబస్తీ ఆగమాగం

భారీ వర్షాలు హైదరాబాద్​ను కనీవినీ ఎరుగని రీతిలో బాధలకు గురిచేశాయి. చెరువు కట్టలు తెగిపోవడంతో పాతబస్తీలో పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉండగా.. కొన్ని ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వాహనాలు, ఇంటి సామాన్లు అన్నీ కొట్టుకుపోయి బురద మాత్రం మిగిలిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5 కోట్ల డివిడెండ్

2019-2020 ఏడాదికి సంబంధించి తెలంగాణ గిడ్డంగుల సంస్థ లాభాల నుంచి రూ.5 కోట్ల డివిడెండ్​ను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ఛైర్మన్​ సామేలు ఆధ్వర్యంలోని అధికారుల బృందం మంత్రి నిరంజన్ రెడ్డికి చెక్కును అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. అసెంబ్లీలోనే నిద్రించి ఎమ్మెల్యేల నిరసన

పంజాబ్ ప్రభుత్వం... వ్యవసాయ కొత్త చట్టం ముసాయిదా కాపీలను ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు. రాత్రి శాసనసభ భవనంలో ఉండి నిరసన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. దేశంలో భారీగా తగ్గిన కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 46,791 కేసులు నమోదయ్యాయి. మరో 587మంది కరోనా ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. అర్జెంటీనాలో 10లక్షలు దాటిన కేసులు

ప్రపంచంలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అర్జెంటీనాలో మొత్తం బాధితుల సంఖ్య 10 లక్షలు దాటింది. మరోవైపు అమెరికా, బ్రెజిల్​, రష్యా సహా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. బొగ్గుగనిలో ప్రమాదం

ఉత్తర చైనాలోని బొగ్గుగనిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఒకరికి గాయలైనట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. లాభాల్లో మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇటీవల నమోదైన భారీ లాభాల నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీఎస్​ఈ-సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా లాభంతో 40,589 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. లీగ్​కు సిద్ధమైన మలింగ

ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​ నుంచి వ్యక్తిగత కారణాలతో వైదొలగిన శ్రీలంక పేసర్​ లసిత్​ మలింగ.. స్వదేశంలో జరగనున్న లంక ప్రీమియర్​ లీగ్​లో ఆడబోతున్నాడు. ఇతడితో పాటు డుప్లెసిస్​, రసెల్​, షాహిద్​ అఫ్రిదిలు ఈ టోర్నీలో భాగం కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఆ డాక్టర్​ స్టెప్పులకు హృతిక్​ ఫిదా

అసోంకు చెందిన డాక్టర్​ అరుప్​ సేనాపతి.. పీపీఈ కిట్​ ధరించి చేసిన డాన్స్​ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. ఆ వీడియోకు ఫిదా అయిన హృతిక్​ రోషన్​.. వైద్యుడు వేసిన స్టెప్పులను నేర్చుకోవాలనుకుంటున్నట్లు రీట్వీట్​ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details