1. రాష్ట్రంలో మరో 1,486 కరోనా కేసులు
రాష్ట్రంలో మరో 14 వందల 86 కరోనా కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 2 లక్షల 24 వేల 545కు చేరగా.. 12 వందల 82 మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. భారీ వర్షాల ఎఫెక్ట్: పాతబస్తీ ఆగమాగం
భారీ వర్షాలు హైదరాబాద్ను కనీవినీ ఎరుగని రీతిలో బాధలకు గురిచేశాయి. చెరువు కట్టలు తెగిపోవడంతో పాతబస్తీలో పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉండగా.. కొన్ని ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వాహనాలు, ఇంటి సామాన్లు అన్నీ కొట్టుకుపోయి బురద మాత్రం మిగిలిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5 కోట్ల డివిడెండ్
2019-2020 ఏడాదికి సంబంధించి తెలంగాణ గిడ్డంగుల సంస్థ లాభాల నుంచి రూ.5 కోట్ల డివిడెండ్ను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ఛైర్మన్ సామేలు ఆధ్వర్యంలోని అధికారుల బృందం మంత్రి నిరంజన్ రెడ్డికి చెక్కును అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అసెంబ్లీలోనే నిద్రించి ఎమ్మెల్యేల నిరసన
పంజాబ్ ప్రభుత్వం... వ్యవసాయ కొత్త చట్టం ముసాయిదా కాపీలను ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు. రాత్రి శాసనసభ భవనంలో ఉండి నిరసన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. దేశంలో భారీగా తగ్గిన కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 46,791 కేసులు నమోదయ్యాయి. మరో 587మంది కరోనా ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.