1. దేశంలో 67 లక్షలు దాటిన కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య 67 లక్షలు దాటింది. కొత్తగా 70,049 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. మరో 986 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులోనే దాదాపు 12 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు జరిగాయి. అదే సమయంలో కరోనా రికవరీల సంఖ్య కూడా పెరుగుతోంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రాష్ట్రంలో 2,154
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 2,154 కొవిడ్ కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 2,04,748కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 1,189 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు'
నవంబర్, డిసెంబర్ నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన... త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'నన్నెవరూ పట్టించుకోవడం లేదు'
నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఆసుపత్రుల్లో కరోనాకు సరైన చికిత్స అందించండం లేదు... చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మళ్లీ 'పళనిస్వామి'కే ఓటు
వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ ప్రకటన చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.