తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@1PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​@1PM
టాప్​ టెన్​ న్యూస్​@1PM

By

Published : Jul 18, 2021, 12:59 PM IST

'ఎలుక' కథనానికి స్పందించిన మంత్రి

'ఆపరేషన్ కోసం దాచుకున్న 2 లక్షలు ఎలుకలు కొట్టేశాయి!' ఈటీవీభారత్ కథనాని(Etv Bharat Effect)కి రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్‌ స్పందించారు. ఎలుకలు కొరకడం వల్ల రూ.2 లక్షలు నష్టపోయిన రైతు రెడ్యాకు సాయం చేస్తానని ముందుకొచ్చారు. అంతేకాకుండా అతడికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'పద్మశ్రీ'కి పలకరింపే కరవైంది!

కొన ఊపిరితో ఉన్న ఆదివాసీల కళలకు ప్రాణం పోసి ప్రపంచానికి పరిచయం చేసిన కళాకారున్ని సమాజం మర్చిపోయింది. పద్మశ్రీ అవార్డు గ్రహీతే అనారోగ్యంతో బాధపడుతుంటే పట్టించుకునే నాథుడు కరవయ్యాడు. ప్రాచుర్యంలో ఉన్నప్పుడే హడావుడి చేసే ప్రభుత్వాలు.. క్షయవ్యాధితో కుమిలిపోతుంటే కనీసం అటువైపు కూడా తొంగిచూడట్లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

దుర్గమ్మకు బంగారుబోనం

విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోనం సమర్పించింది. గత పన్నెండేళ్ల నుంచి దుర్గమ్మకు బోనాలు సమ్పరిస్తుండటం ఆనవాయితీగా వస్తోందని భక్తులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

యాదాద్రిలో భక్తుల కిటకిట

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి(Yadadri Temple) ఆలయం కిటకిటలాడుతోంది. నేడు స్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా.. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అఖిలపక్ష భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అఖిలపక్షం సమావేశమైంది. పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా జరిగేలా సహకరించాలని ఈ భేటీలో విపక్షాలను కోరనుంది కేంద్రం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మహా విషాదం

వేర్వేరు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా 25 మంది మృతి చెందారు. మహారాష్ట్ర ముంబయిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్​ నాథ్​ కోవింద్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే​ విచారం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ముష్కర కూటమి

అఫ్గాన్​పై విరుచుకుపడుతున్న తాలిబన్లకు జైషే మహమ్మద్, లష్కరే తొయిబా ఉగ్రసంస్థలు మద్దతు పలుకుతున్నాయి. తమ ఉగ్రవాదులను తాలిబన్ల పోరాటంలో భాగం చేస్తున్నాయి. ఇది భారత్​కు కచ్చితంగా ఆందోళన కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

స్పేస్​లో భారత్​ హవా

అంతరిక్ష యాత్రలో భారత్​ అమ్మాయిలు సత్తాచాటుతున్నారు. నిన్నకాక మొన్న వర్జిన్​ గెలాక్టిక్ వ్యోమనౌకలో తెలుగు అమ్మాయి శిరీష.. రోదసిలో అడుగుపెట్టగా, అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్​ చేపట్టనున్న స్పేస్​ టూర్​ వెనకాల మరో భారతీయురాలి కృషి ఉండటం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

టోక్యోలో భారత అథ్లెట్లు

ఈ నెల 23 నుంచి​ జరగనున్న ఒలింపిక్స్​లో(Tokyo Olympics) పాల్గొనేందుకు భారత క్రీడాకారుల తొలి బృందం(First batch of Indian athletes) టోక్యో చేరుకుంది. ఆర్చరీ, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, హాకీ, జూడో, జిమ్నాస్టిక్స్‌, స్విమ్మింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగాలకు చెందిన 54 మంది క్రీడాకారులు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయాన్ని స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(సాయ్​) వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ఆదిత్య 369'కు 30ఏళ్లు పూర్తి

నందమూరి బాలకృష్ణ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ఆదిత్య 369'.. 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ సినిమా విశేషాలతో పాటు తెర వెనుక సంగతులు మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details