తెలంగాణ

telangana

By

Published : Jul 10, 2021, 5:00 PM IST

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @5PM
టాప్​ టెన్​ న్యూస్​ @5PM

'రాజీపడే ప్రసక్తే లేదు'

కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామన్నారు. శనివారం నారాయణపేట జిల్లాలో మంత్రి పర్యటించారు. జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల ఐసీయూ వార్డును ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ప్రలోభాల పర్వం కొనసాగుతోంది'

హుజూరాబాద్​లో తెరాస ప్రలోభాల పర్వం కొనసాగుతోందని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. దొంగ ఓట్ల నమోదు ప్రక్రియ కూడా జరుగుతోందని ఆరోపించారు. నియోజకవర్గానికి చెందని వారికి సైతం ఓట్లు నమోదు చేస్తున్నారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జంతు ప్రేమికులకు శుభవార్త

జంతు ప్రేమికులకు జూ అధికారులు శుభవార్త తెలిపారు. కొవిడ్ కారణంగా మూతపడ్డ నెహ్రూ జంతు ప్రదర్శన శాల ఆదివారం నుంచి పునః ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి కారణంగా కొన్ని నెలలుగా సందర్శనను నిలిపివేసిన అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'పంచసూత్ర ప్రణాళికే రక్ష'

హైదరాబాద్​లోని తన నివాసంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ఒకటి "టెర్రస్​ గార్డెన్​", మరోటి 'కొత్త(కరోనా) కథలు". 80 మంది రచయితలు రాసిన కథా సంకలనాన్ని ఎస్పీ బాలుకు అంకితం చేయటం పట్ల ప్రచురణకర్తలను అభినందించారు. కరోనాను జయించాలంటే ప్రతీ ఒక్కరు పంచసూత్ర ప్రణాళికను పాటించాల్సిందేనని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​

కశ్మీర్​లోని అనంత్​ నాగ్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతం అయినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బడా డ్రగ్స్​ ముఠా అరెస్ట్​

అక్రమంగా తరలిస్తున్న 350 కిలోల హెరాయిన్​ను దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం దీని విలువ రూ. 2,500 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కరోనా భయమే లేదు..

కరోనా ఆంక్షలను పలు రాష్ట్రాలు సడలిస్తున్న వేళ పర్యాటక ప్రాంతాలకు జనం భారీగా తరలివస్తున్నారు. హరిద్వార్​లో గుంపులు గుంపులుగా భక్తులు నదీస్నానాలు చేస్తున్నారు. కరోనా మూడో దశ వ్యాప్తి కంటే ముందే వచ్చామని, అందువల్ల వైరస్ ముప్పు గురించి భయం లేదని పలువురు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

భీకర పోరు

అఫ్గానిస్థాన్​లో 109 మంది తాలిబన్లు భద్రతా దళాల చేతిలో హతమయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. రెండు రాష్ట్రాల్లో జరిగిన భద్రతా బలగాలకు, తాలిబన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

హర్భజన్​కు పుత్రోత్సాహం

సీనియర్​ క్రికెటర్​ హర్భజన్​ సింగ్(Harbhajan singh) తీపికబురు వినిపించాడు. తన​ భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు చెబుతూ భావోద్వేగ ట్వీట్​ చేశాడు. ఈ సారి ఐపీఎల్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​ తరఫున భజ్జీ ఆడుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అనుపమ లవ్​ బ్రేకప్

తాను గతంలో ఓ వ్యక్తిని ఇష్టపడ్డానని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పింది. అయితే ఆ బంధం బ్రేకప్​ అయిపోయిందని వెల్లడించింది. ప్రస్తుతం ఈమె తెలుగులో మూడు సినిమాలు చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details