తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీపై ఈసీ అభ్యంతరం - telangana latest news

ఎన్నికల కోడ్​ అమల్లో ఉండగా సీఎంతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కావడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీపీసీసీ ఎన్నికల కన్వీనర్ ఫిర్యాదుపై స్పందించిన రిటర్నింగ్​ అధికారి.. ఉద్యోగ సంఘాలకు నోటీసులు జారీచేశారు.

ec notice to NGOs in telangana
సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీపై ఈసీ అభ్యంతరం

By

Published : Mar 17, 2021, 1:52 PM IST

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాలు భేటీ కావడం పట్ల ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు హైదరాబాద్​-రంగారెడ్డి- మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ రిటర్నింగ్ అధికారి ప్రియాంక.. ఉద్యోగ సంఘాలకు ఈనెల 15న నోటీసులు జారీ చేశారు. 24 గంటల లోపల సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈసీ జారీచేసిన నోటీసులు

ఫిర్యాదు ఏంటి..?

టీపీసీసీ ఎన్నికల కన్వీనర్ నిరంజన్... ఈ నెల 9న రిట్నరింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్​తో సమావేశమైన అనంతరం పీఆర్సీపై మీడియాతో మాట్లాడారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. 29 శాతం ఫిట్​మెంట్ ఇస్తామని, పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతామని.. ఇతర సమస్యలను పరిష్కరించడానికి సీఎం సుముఖంగా ఉన్నారని ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో చెప్పడం వల్ల... తెరాస అభ్యర్థి వాణిదేవికి పట్టభద్రుల ఎన్నికల్లో అనుకూలంగా వ్యవహరించినట్లైందని నిరంజన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు రిటర్నింగ్ అధికారి ప్రియాంక అల ఉద్యోగ సంఘాలకు నోటీసులు జారీ చేశారు.

ఉద్యోగ సంఘాలు ఏమన్నాయ్​..

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి వారిపై ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని టీఎన్జీఓ, టీజీఓ, పీఆర్టీయూ ఉద్యోగ సంఘాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వివరణ కోరారు. సాధారణంగానే ముఖ్యమంత్రితో భేటీ అయ్యామని ఉద్యోగ సంఘాలు.. ఎన్నికల కమిషన్​కు సమాధానమిచ్చాయి. ఉద్యోగుల సమస్యలపై చర్చించామని.. బడ్జెట్​తో పాటు... ఇతర సమస్యలను సీఎంతో చర్చించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు ఎన్నికల కమిషన్​కు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నాయి.

ఇవీచూడండి:కౌంటింగ్​ కేంద్రాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది: కోదండరాం

ABOUT THE AUTHOR

...view details