తెలంగాణ

telangana

ETV Bharat / city

దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల.. జులై 1నుంచి రిజిస్ట్రేషన్‌ - దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల

డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. జులై 1 నుంచి మూడు విడతలుగా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను నిర్వహించనున్నారు. మొబైల్‌తో పాటు టీఎస్ యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్లు చేసుకొనే సదుపాయం కల్పించారు. వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేశారు.

dost notification
dost notification

By

Published : Jun 22, 2020, 6:03 PM IST

డిగ్రీ ప్రవేశాల కోసం ఉన్నత విద్యా మండలి దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు కాలేజీలు, కోర్సుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలి పేర్కొంది. కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను మభ్య పెట్టి.. మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

  • జులై 1 నుంచి 14 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
  • జులై 6 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
  • జులై 22న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
  • జులై 23 నుంచి 27 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌
  • జులై 23 నుంచి రెండో విడత ప్రక్రియ ప్రారంభం
  • జులై 23 నుంచి 29 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
  • జులై 23 నుంచి 30 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
  • ఆగస్టు 7న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
  • ఆగస్టు 8 నుంచి 13 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
  • ఆగస్టు 8 నుంచి 14 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
  • ఆగస్టు 13న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
  • సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details