కరోనా దృష్ట్యా.... ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసేందుకు వైద్యుల నియామకాలకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా టిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిన ఈ నియామకాలను చేపట్టనున్నారు. జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు 35, అనస్తీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్లు 35, టీబీ అండ్ సీడీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 15 మందిని నియమించనునట్టు సర్కారు ప్రకటించింది.
కరోనా ఆస్పత్రుల్లో పని చేసేందుకు డాక్టర్లకు ప్రభుత్వ పిలుపు - hyderabad hospitals
కరోనా ఆస్పత్రుల్లో ఏడాది పాటు కాంట్రాక్టు పద్ధతిన పనిచేసేందుకు వైద్యులను నియమించేందుకు ప్రభుత్వ ప్రకటన విడుదల చేసింది. ఆయా విభాగాల్లో కలిపి మొత్తం 85 మంది కోసం ఈ నెల 17 న కోటీలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపింది. నెల జీతం రూ. లక్షా 25 వేలతో పాటు పలు ఇంసెంటివ్స్ని ఇస్తానంది.
![కరోనా ఆస్పత్రుల్లో పని చేసేందుకు డాక్టర్లకు ప్రభుత్వ పిలుపు doctors recruitment in Hyderabad government hospitals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8411744-114-8411744-1597358717476.jpg)
doctors recruitment in Hyderabad government hospitals
ఏడాది కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిన నియమించనున్న ఆయా విభాగాల వైద్యులకు రూ.లక్షా 25 వేల నెల జీతంతో పాటు ఇతరత్రా ఇన్సెంటివ్స్ ఇవ్వనున్నట్టు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ప్రకటించింది. ఈ నెల 17న కోటి వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంఈ ఆడిటోరియంలో ఇంటర్వ్యూ పద్ధతిన నియామకాలు చేపతనున్నట్టు స్పష్టం చేసింది.